మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్(Mahadevpur) మండలంలో పెద్దపులి9Tiger) సంచారం కలకలం రేపుతుంది. మండలంలోని బీరసాగర్, అన్నారం పరిధిలోని అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పులి పాద ముద్రలను అధికారులు సమీప అడవుల్లో గుర్తించారు. పులి జాడ కోసం అడవిలో జల్లెడ పడుతున్నారు. పరిసర గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. త్వరగా పులిని బంధించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Kishan Reddy | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా : కిషన్ రెడ్డి
Jagithayala | మద్దులపల్లిలో విషాదం.. చికిత్స పొందుతూ చిన్నారులు మృతి