సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
లబ్ధిదారుల ఇంటికెళ్లి చెక్కులు అందజేత
తల్లాడ, ఏప్రిల్ 4: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని 15 గ్రామాల లబ్ధిదారుల ఇంటికెళ్లి చెక్కులను అందజేశారు. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన నూతనకల్ ఉపసర్పంచ్ తీకు సీతారాములు ఇంటికి వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కు ఇచ్చారు. అనారోగ్యం బారినపడిన 15 గ్రామాల్లో 74 మంది బాధితులకు రూ.39,14,250 విలువైన సీఎమ్మారెఫ్ చెక్కులను పంపిణీచేశారు. 32 మంది నవవధువులకు రూ.33,03,828 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్తోనే కులవృత్తులకు వైభవం
గజ్వేల్ మార్కెట్ దేశానికే మోడల్
మహనీయుల జయంత్యుత్సవాలు నిర్వహించాలి
అగ్రకులాల పేదలు అభివృద్ధి చెందాలి