కరీంనగర్ శివారులో రోడ్డుపై క్యాడిష్ఫ్లై పురుగుల విహారం
వాహనదారులకు ఇక్కట్లు.. చర్యలు చేపట్టిన అధికారులు
తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 4: ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ సాయంత్రం కాగానే కుప్పలుతెప్పలుగా వస్తున్న పురుగులతో ఆ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఇక్కట్లు పడుతున్నా రు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్ శివారులో రాజీవ్ రహదారిపై కాకతీయ కాలువ వద్ద కొన్ని రోజులుగా సాయంత్రం వేళ పురుగులు వీర విహారం చేస్తున్నాయి. శనివారం రాత్రి ఈ కారణంగా పలువురు ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్, ఎల్ఎండీ ఎస్సై కృష్ణారెడ్డి, ఏవో సురేందర్, శాస్త్రవేత్త శేఖర్ ఆదివారం ఉదయం కాలువ వద్దకు చేరుకుని పురుగుల నమూనాలను సేకరించారు. వాటిని కీటక శాస్త్రవేత్తలకు పంపించగా క్యాడిష్ ఫ్లై పురుగులుగా నిర్ధారించారు. వాటి నివారణకు కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కమిషనర్ క్రాంతి, అప్రమత్తమయ్యారు. పురుగులను ఆకర్షించే హైమాస్ట్ లైట్లను కెనాల్ వద్ద ఏర్పాటు చేయించారు. మున్సిపల్ సిబ్బందితో పురుగుల నివారణకు పురుగుల మందును పిచికారీ చేయించారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్తోనే కులవృత్తులకు వైభవం
గజ్వేల్ మార్కెట్ దేశానికే మోడల్
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
మహనీయుల జయంత్యుత్సవాలు నిర్వహించాలి
అగ్రకులాల పేదలు అభివృద్ధి చెందాలి