వ్యూహాత్మక ప్రచారంలో టీఆర్ఎస్
భగత్కు మద్దతుగా బహుజన సమ్మేళనం
క్షేత్రస్థాయి ప్రచారంలోకి కుల సంఘాలు
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారం హోరెత్తుతున్నది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు కోసం కుల సంఘాల న్నీ ఏకమయ్యాయి. నియోజకవర్గానికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ వల్లే తమ బతుకులు బాగుపడ్డాయని అన్నివర్గాల ప్రజలు టీఆర్ఎస్కు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నారు. నియోజక వర్గంలోని త్రిపురారం, గుర్రంబోడు, మాడుగులపల్లి, హాలి యా, పెద్దవూర, తిరుమలగిరి, నిడమనూరు మండల్లాల్లో టీఆర్ఎస్ శ్రేణులు ఇటింటి ప్రచారం చేస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నా యి. ప్రజాబలం.. పార్టీ బలగానికితోడు అన్ని వర్గాల ప్రజ లు, కులసంఘాలు తాము టీఆర్ఎస్ వెంటే ఉంటామని ప్రకటించేసరికి మునుపెన్నడూలేని విధంగా కాంగ్రెస్ అభ్య ర్థి జానారెడ్డి తన ప్రచారంలో అసహనం ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ఆయనకు మద్దతుగా వస్తున్న కాంగ్రెస్ నేతలు సైతం టీఆర్ఎస్కు వస్తున్న ఆదరణ చూసి ‘పోటీలో నిలిచినప్పుడు ఏదో ఒకటి చేయాలి’ కదా అని చెప్తూ మీడియా సమావేశాలు నిర్వహించి వెళ్లిపోతున్నారు. ఇక బీజేపీకి సాగర్లో లీడర్ లేడు.. క్యాడర్ అంతకన్నా లేదు. ఉనికి కోస మే పోటీచేస్తున్నామంటూ ఆ పార్టీ శ్రేణులే పేర్కొంటున్నాయి.
బీసీ సీటు బీసీకే..
బీసీలకు అండగా నిలిచిన టీఆర్ఎస్కు పార్టీలకతీతంగా బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలనే వాతావరణం సాగర్లో నెలకొన్నది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు మద్దతు ప్రకటించిన 93 బీసీ కుల, వృత్తి సంఘాలు సాగర్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. వెనుకబడినవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న టీఆర్ఎస్కు మద్దతుగా నిలబడాలని, దేశంలో ఇంత నిబద్ధతతో పనిచేస్తున్న సీఎం మరొకరులేర ని బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ఇప్పటికే నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి బీసీ సంఘాల ప్రతినిధులు భగత్ గెలుపు కోసం పనిచేస్తున్నాయని, రెండు మూడురోజుల్లో సాగర్లో సమావేశం నిర్వహిస్తామన్నారు. మరోవైపు భగత్కు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో బహుజన సమ్మేళనం నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్తోనే కులవృత్తులకు వైభవం
గజ్వేల్ మార్కెట్ దేశానికే మోడల్
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
మహనీయుల జయంత్యుత్సవాలు నిర్వహించాలి
అగ్రకులాల పేదలు అభివృద్ధి చెందాలి