తెలంగాణ సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడాలేవు
ఆదాయం పెంచి.. పేదలకు పంచాలన్నదే కేసీఆర్ లక్ష్యం
కాంగ్రెస్ పాలనలో ఆకలిచావులు, ఆత్మహత్యలే..
మంత్రులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్
హాలియా, ఏప్రిల్ 4: వ్యవసాయంతోపాటు కుల వృత్తులను అభివృద్ధి చేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని భావించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, ఆకలిచావులే ఉండేవని.. తెలంగాణ వచ్చినంక ఆత్మహత్యలను నివారించి, ఆకలిని పారదోలామని చెప్పారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో ఆదివారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గీత కార్మిక సహకార సంఘం సదస్సులో ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి జగదీశ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం అంటే ఎట్లుంటది.. ఎవరి కోసం పనిచేస్తదన్న విషయం ప్రజలకు తెలిసేది కాదన్నారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చా క.. బడుగు, బలహీనవర్గాల కోసం పనిచేస్తదన్న విషయం ప్రజలకు తెలిసిందని చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఆదాయం పెంచి, పేదలకు పంచాలన్న ఉద్దేశంతో కేసీఆర్ పాలన సాగుతున్నదని తెలిపారు. 70 ఏండ్ల స్వరాజ్యంలో మ్యానిఫెస్టోను పూర్తిగా అమలుచేసిన పార్టీ దేశంలో టీఆర్ఎస్ ఒక్కటేనని స్పష్టంచేశారు. అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న సీఎం కేసీఆర్కు సాగర్ నియోజకవర్గ ప్రజలు అండగా నిలువాలని పిలుపునిచ్చారు.
కుల వృత్తులకు జీవం : మంత్రి శ్రీనివాస్గౌడ్
కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ర్టాన్ని 70 ఏండ్లు పాలించిన పార్టీలు కుల వృత్తులను విస్మరిస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం జీవంపోసిందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్లో కల్లు కాంపౌండ్లను నిషేధించి, గౌడ వృత్తిని ఖతం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో కల్లు కాంపౌండ్లను తెరువడంతోపాటు నీరాను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. గౌడ వృత్తిని ఆదుకునేందుకు 3.70 కోట్ల తాటి, ఈత మొక్కలను నాటామని తెలిపారు. హైదరాబాద్లో గౌడ సంఘం భవన నిర్మాణం కోసం రూ. 250 కోట్ల విలువ చేసే భూమిని కేసీఆర్ ప్ర భుత్వం ఇచ్చిందని వెల్లడించారు. జానారెడ్డి పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉందని.. ఆయన చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమ ని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ విజయం ఖాయ మన్నారు. గౌడ సంఘ నాయకులు రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, కోనేరు కోనప్ప, గౌడ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్గౌడ్ పాల్గొన్నారు.
సాగర్లో టీఆర్ఎస్దే విజయం: మంత్రి తలసాని
నల్లగొండ, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వైపే చూస్తున్నారని, సాగర్లో నోముల భగత్ గెలుపు ఖాయమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. జానారెడ్డి హయాం లో నియోజకవర్గంలోని ప్రజలు తాగు, సాగు నీరు, రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులకు నోచుకోలేదని విమర్శించారు. ఆదివారం హాలియాలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంతకుముందు నాగార్జునసాగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2014లో కేసీఆర్ సీఎం అయ్యాక మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరిచ్చారని గుర్తుచేశారు. ఇప్పటికే ఉన్న లిఫ్ట్ల నిర్వహణ ప్రభుత్వం చేపట్టిందని.. బీళ్లుగా మిగిలి ఉన్న భూముల కోసం నెల్లికల్, ఇతర లిఫ్టులను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని చెప్పారు. జానారెడ్డికి ఇప్పటితరం ఆలోచనల మధ్య స్పష్టమైన అంతరం ఉందని అభిప్రాయపడ్డారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి హుజూర్నగర్లోనే తన సతీమణిని గెలిపించుకోలేకపోయాడని, సాగర్లో ఏమీ చేయలేడని పేర్కొన్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
హోరెత్తిన ప్రచారం..
సాగర్లో టీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతున్నది. అనుముల మండలంలోని యాచారం, కాశివారిగూడెంలో ముస్లిం మైనార్టీల సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. గుర్రంపోడు మండలంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, అభ్యర్థి నోముల భగత్తో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రచారం చేశారు. హాలియాలో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం లో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, తెలంగాణ పోలీస్ హౌసిం గ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్గుప్తా, తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ, తెలంగాణ హస్తకళల చైర్మ న్ బొల్లం సంపత్ పాల్గొన్నారు. తిరుమలగిరి (సాగర్) మండలం నెల్లికల్లో జరిగిన మత్స్యకారుల సమావేశంలో ఎంపీ బండా ప్రకాశ్, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పాల్గొన్నారు. త్రిపురారంలో టీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే శంకర్నాయక్ పాల్గొన్నారు.
నోముల భగత్కు బీసీ సంఘాల మద్దతు
ముషీరాబాద్, ఏప్రిల్ 4: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు పలు బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో తెలంగాణ బీసీ జాగృతి, సెంట్రల్ ఓబీసీ కమిటీ, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక, జాతీయ బీసీ అధ్యయన కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో 52 బీసీ కుల సంఘాలు, ఆరు ఉద్యోగ సంఘాలు, యువజన విద్యార్థి, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావుల సంఘాల ప్రతినిధులు పాల్గొని టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ.. ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా సీఎం కేసీఆర్ బీసీ అభ్యర్థి నోముల భగత్కు టికెట్ ఇవ్వడం హర్షణీయమన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని తెలిపారు. సమున్నత లక్ష్యాలతో బీసీల సమగ్ర వికాసం, జీవన భరోసాతోపాటు ఆత్మగౌరవం పెంచిన టీఆర్ఎస్కు మద్దతుగా నిలువనున్నట్టు చెప్పారు.
టీఆర్ఎస్కు మద్దతుగా రజకులు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు రజకులంతా మద్దతుగా నిలుస్తున్నారని రజక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు సత్యనారాయణ ఆదివారం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
గజ్వేల్ మార్కెట్ దేశానికే మోడల్
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
మహనీయుల జయంత్యుత్సవాలు నిర్వహించాలి
అగ్రకులాల పేదలు అభివృద్ధి చెందాలి