యాచారం, ఏప్రిల్ 2 : టీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మేడిపల్లి సర్పంచ్ చిగురింత శ్రీనివాస్రెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన సర్పంచ్ శ్రీనివాస్రెడ్డితో పాటు కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్రెడ్డి మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. మేడిపల్లి గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సహకరిస్తానని హామీ ఇచ్చారు. మండలంలో పార్టీని మరింత పటిష్టంగా తయారుచేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ మండలలాధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, కొత్తపల్లి సర్పంచ్ హబీబ్, గున్గల్ సర్పంచ్ ఇందిర, మేడిపల్లి ఎంపీటీసీ మొరుగు శివలీల, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, డైరెక్టర్ మక్కపల్లి స్వరూప, నాయకులు చిన్నోళ్ల యాదయ్య, రాజునాయక్, తలారి మల్లేశ్, ఎరుకల బాల్రాజ్, మొరుగు రమేశ్ పాల్గొన్నారు.
ఆపదలో అండగా సీఎంఆర్ఎఫ్
ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని మునుగనూరుకు చెందిన సుందరయ్యకు రూ.60వేలు, గోవర్ధన్కు రూ.60వేలు, వెంకటేశ్కు రూ.52వేలు, మున్సిపాలిటీకి చెందిన నాగశెట్టికి రూ.36వేలు, సిద్ధప్పకు రూ.34వేలు, ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామానికి చెందిన కృష్ణకు రూ.24వేలు, రవికి రూ.22వేలు, యాచారం మండలం గున్గల్కు చెందిన షాహిన్బేగానికి రూ.24వేల సహాయనిధి చెక్కులను అందజేశారు.
పెండింగ్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలి
మున్సిపాలిటీలోని ఇందు అరణ్య విల్లాస్, అపార్ట్మెంట్లో పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్లను పూర్తి చేయాలని కౌన్సిలర్ తొండాపు రోహిణిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయా కాలనీల అసోసియేషన్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సదరు ఫైల్ మంత్రి హరీశ్రావు వద్ద ఉన్నదని రెండు రోజుల్లో మంత్రిని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మధుసూదన్రెడ్డి, సుందర్రావు, రవి, చిన్నా రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి
పోలింగ్ రోజునే మోడీ బెంగాల్ ఎందుకు వస్తున్నారు?: మమత
121 ఏండ్ల నాటి చాక్లెట్.. అటక మీద దొరికిందోచ్..!