‘అధికారంలో వస్తే చిటికేస్తే పనులు అయితయన్నరు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో గ్యారెంటీలన్నీ గో విందా.. ప్రతి స్కీంలో మోసం.. ప్రతి విషయంలో దగా.. ఇదే కాంగ్రెస్ పాలన’ అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిప్పులు చెరిగారు. శుక్రవారం సాయంత్రం మహబూబ్నగర్కు పోరుబాట బస్సుయాత్ర చేరుకున్నది. గడియారం చౌరస్తా వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను విస్మరించాయన్నారు.
కేవలం అధికారం కోసం అడ్డగోలు వాగ్దానాలు చేసి మోసం చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ గ్యారెంటీలిచ్చింది. ఇప్పుడెవరికైనా రైతుబంధు వచ్చిందా? కల్యాణలక్ష్మి వచ్చిందా? రూ.2వేల పింఛన్ రూ.4వేలు అయ్యిందా? అని ప్రశ్నించారు. చోటేమియా, బడేమియాలకు ఓటేస్తే మనల్ని పాతాళానికి తొక్కుతారన్నారు. అచ్చేదినా..? సచ్చేదినా..? అంటూ దుయ్యబట్టారు. తెలంగాణ ప్రయోజనాలను తుంగలో తొక్కిన బీజేపీకి ఎం దుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు.
‘ఒకవైపు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతుంటే.. మరోవైపు ఆంధ్రకు నీళ్లు ఎత్తుకుపోతున్న వాళ్లకు ఇదే డీకే అరుణ రాయలసీమకు పోయి హారతులు పట్టింది.. అందుకు ఆమెకు ఓటేయాల్నా’ అంటూ ప్రశ్నించారు. పాలమూరు ఎంతో వెనుకబడిందని.. ఇక్కడ కడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హో దా ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదన్నారు. డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలే కదా? ఒక్కసారైనా జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడిగిందా? హోదా ఇప్పించే ప్రయత్నం చేసిందా? వీళ్లకా మనం ఓటేసేది? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన వాగ్దానాలేవీ అమలు చేయలే.. స్కూటీలు రాలే కానీ లూటీ చేస్తున్నారని విమర్శించారు.
‘నాకండ్ల ముందే తెలంగాణను నాశనం చేస్తామంటే చూస్తూ ఊరుకోను. కేసీఆర్ యుద్ధం చేస్తడే తప్పా ఊరుకునే వ్యక్తి కాడు. చూస్తూ ఊరుకుందామా? యుద్ధం చేద్దా మా? యుద్ధానికి అందరం సిద్ధమవుదామా?.. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటే.. ప్రాంతీయ పార్టీల మనుగడ లేకుండా చేసేందుకు జాతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వీటిని తిప్పికొట్టాలి’ అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
పాలమూరులో బస్సు యాత్ర హోరెత్తించింది.. గులాబీ దండు కదిలింది.. ఊరూవాడా కదిలొచ్చింది.. జనప్రవాహమై ప్రజానీకం కదం తొ క్కింది.. అభిమానం నింగిని తాకగా.. రెట్టింపు ఉ త్సాహంతో పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు.. నినాదాలు, కేరింతలతో జిల్లా కేంద్రం హోరెత్తిపోయింది.. గులాబీ దళపతి కి బ్రహ్మరథం పట్టగా క్లాక్టవర్ కిక్కిరిసిపోయింది.. డోలు, డప్పు వాయిద్యాల మధ్య కళాకారులు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ మహిళా నేతలు హారతులు పట్టారు. కేసీఆర్ జయహో.. జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది. పాలమూరు పట్టణం గులాబీమయం కాగా కేసీఆర్ స్పీచ్తో ప్రతి గుండె చప్పుడు ప్రతిధ్వనించింది. అశేష జనవాహినితో కార్నర్మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థా నంపై గులాబీ దళం కన్నేసింది. ఈ నే పథ్యంలోని పట్టణంలో కేసీఆర్ చేపట్టి న బస్సుయాత్ర విజయవంతమైంది. పాలమూరు జనసంద్రమైంది. వారం కిందట జిల్లాకేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన కార్నర్ మీటింగ్కు మించి కేసీఆర్ బస్సుయాత్రకు జనం రావడంతో ఆ పార్టీలో గుబులు మొదలైంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక ఉక్కిరిబిక్కిరవుతున్నది. ఈ క్రమంలో అనవసరంగా హస్తం పార్టీకి ఓటేశామని జనం బాధపడుతున్నారు. వద్దు రా బాబోయ్ కాంగ్రెస్ పాలన అంటూ బస్సుయాత్రలో నినదించడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తంగా కే సీఆర్ బస్సుయాత్ర పాలమూరు జిల్లా లో రాజకీయ ప్రకంపనలు సృష్టించిం ది. బీజేపీ, కాంగ్రెస్కు మించి జనం హాజరు కావడంతో పార్టీ నాయకులు ఆనందంలో మునిగిపోయారు.
పాలమూరు ఉప్పొంగింది.. కేసీఆర్ చేపట్టిన పోరుబాట జనసంద్రమైంది.. అడుగడుగునా ఘన స్వాగతం.. జై తెలంగాణ నినాదాలతో పట్టణం హోరెత్తింది.. వద్దురా బాబు ఈ కాంగ్రెస్ పాలన.. అంటూ ఆగ్రహావేషాలు.. దారులన్నీ గులాబీమయం కాగా గడియారం చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ కిక్కిరిసిపోయింది. జనాలను అదుపు చేయడం పోలీసుల తరం కాలేదు. ఊహించని జనసంద్రంతో పోలీసు యంత్రాంగం ఉక్కిరిబిక్కిరైంది. ఇదే పాలమూరులో ఏప్రిల్ 19న సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన కార్నర్ మీటింగ్కు జనం నుంచి పెద్దగా స్పందన రాలేదు. కానీ కేసీఆర్ అడుగు పెట్టగానే గడియారం చౌరస్తా దద్దరిల్లింది. ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి అరగంటకు పైగా పట్టిందంటే ఎంత జనం వచ్చారో ఊహించవచ్చు.
శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన పోరుబాట బస్సుయాత్ర మహబూబ్నగర్లో కొనసాగింది. సాయంత్రం జిల్లాలోకి ప్రవేశించిన కేసీఆర్ బస్సు యాత్రకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు భారీగా చేశారు. జిల్లాలో గులాబీ బాస్ అడుగుపెట్టిన దగ్గరి నుంచి కార్నర్ మీటింగ్ స్థలం వరకు జడ్చర్ల, మహబూబ్నగర్ పట్టణాలు గులాబీమమయ్యాయి. బస్సుయాత్ర షా ద్నగర్, బాలానగర్, రాజాపూర్ మీదుగా జడ్చర్ల, పాలమూరుకు చేరుకున్నది. మార్గమధ్యంలో రాజాపూర్ మండలం మాచర్ల వద్ద కేసీఆర్ కొద్దిసేపు ఫుడ్ కోర్టులో టీ, స్నాక్స్ కోసం ఆగారు. అనుకోకుండా పార్టీ అధినేత కేసీఆర్ రావడంతో హోటల్ సిబ్బంది సైతం ఆశ్చర్యపోయారు. అధినేతను హోటల్ లోపలికి తీసుకెళ్లిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బజ్జీలు తిని, చాయ్ తాగారు.
తర్వాత 15 నిమిషాల పాటు పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డితోపాటు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలతో మాటామంతి నిర్వహించారు. జడ్చర్లకు బస్సుయాత్ర చేరుకోగా నేతలు స్వా గతం పలికారు. అక్కడి నుంచి భారీ కాన్వాయితో పాలమూరుకు యా త్ర చేరుకున్నది. జిల్లా కేంద్రంలో ఎనిమిది కిలోమీటర్ల ప్రధాన రహదారిపై గంటపాటు బస్సుయాత్ర కొనసాగింది. అప్పన్నపల్లి నుంచి మొ దలైన యాత్ర ఏనుగొండ, శ్రీనివాస కాలనీ, పద్మావతి కాలనీ, మెట్టుగడ్డ, న్యూ టౌన్, బస్టాండ్ చౌరస్తా, అశోక్ టాకీస్ చౌరస్తా మీదుగా కార్నర్ మీటింగ్ నిర్వహించే గడియారం చౌరస్తాకు చేరుకున్నది.
బస్సుయాత్రకు జనం నుంచి అపూర్వ స్పందన లభించింది. పలు చౌరస్తాల్లో బస్సుపై నాయకులు, ప్రజలు పూల వర్షం కురిపించారు. డోలు, డప్పు వాయిద్యాలతో అధినేతకు కళాకారులు స్వాగతం పలికారు. న్యూటౌన్ చౌరస్తా వద్ద మాజీ మంత్రి సతీమణి శారదతో పాటు బీఆర్ఎస్ ఎంపీపీ, ఇతర మహిళానేతలు బస్సుకు గుమ్మడికాయతో దిష్టి తీసి బస్సు ముందు పగలగొట్టి కేసీఆర్కు హారతులు పట్టారు. జై కేసీఆర్, సీఎం .. సీఎం.. అంటూ నినదించారు.
పట్టణంలో కేసీఆర్ బస్సుయాత్ర నేపథ్యంలో ప్రధాన రహదారి గులాబీమయమైంది. మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, రాజేందర్రెడ్డి, అంజయ్యయాదవ్ భారీ సంఖ్యలో కార్యకర్తలతో కేసీఆర్కు స్వాగతం పలికారు. కార్యకర్తలు గులాబీ జెండాలు పట్టుకొని బస్సుయాత్ర వెంటే సాగగా కేసీఆర్ అభివాదం చేస్తూ ముం దుకు సాగారు. అధినేతను చూడగానే జనం కేరింతలు కొట్టడం కనిపించింది. యాత్రలో ట్రాఫిక్ను నియంత్రించడంలో పోలీస్ యం త్రాంగం పూర్తిగా విఫలమైంది.
అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని తుంగలో తొక్కిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. శుక్రవారం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు ఎక్కువ చేసి ఇస్తామని, పింఛన్లు నాలుగువేలు ఇస్తామని, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీలిచ్చి అధికారంలో వచ్చిందన్నారు. పాలమూరు ప్రజలు కాంగ్రెస్ బూటకపు వాగ్దానాలను నమ్మి మోసపోయారన్నారు. నవంబర్లో పెళ్లి చేసుకోకండి.. డి సెంబర్లో పెళ్లి చేసుకోండి తులం బంగారం ఇస్తామన్నరు.
డిసెంబర్లో నే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసపూరిత వాగ్దానాలిచ్చి ప్రజల్ని వంచించిందని మండిపడ్డారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు అయ్యిందని.. ఈ ఎన్నికల్లోనైనా ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చె ప్పాలని పిలుపునిచ్చారు. చావు నోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించి.. వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసి వలసలను నిర్మూలించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ‘గడియారం చౌరస్తా ఎ ట్లుండే.. ఎట్ల అయ్యింది.. కాంగ్రెస్ హయాంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలి.. బీఆర్ఎస్ బలపర్చిన ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలి” అని ఓటర్లను కోరారు.