షాద్నగర్, ఏప్రిల్ 26 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు షాద్నగర్ బైపాస్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఘన స్వాగతం లభించింది. మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో మార్మోగింది.
కార్యకర్తల ఉత్సాహాన్ని గమనించిన కేసీఆర్ వారికి విజయ సంకేతాన్ని చూపుతూ అభివాదం చేశారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని.. కేసీఆర్ అంటేనే ఓ చరిత్ర, ఓ ధైర్యం, ఓ శక్తి అని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, కేశంపేట ఎంపీపీ రవీందర్యా దవ్, నారాయణరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్రెడ్డి, నాయకులు మురళీధర్రెడ్డి, రంగయ్యగౌడ్, దేవేందర్యాదవ్, ఎజాజ్అడ్డు, గణేశ్నాయక్, శ్రీనివా స్, ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.