లండన్ : నార్ఫోక్లోని ఓ ఇంటి అటకపై 121 సంవత్సరాల క్రితం నాటి చాక్లెట్ బార్ ఒకటి దొరికింది. ఇది ఎరుపు రంగు పెట్టెలో చెక్కుచెదరకుండా రేపర్తో కప్పబడి ఉన్నది.
రుచికరమైన ఈ ప్యాకెట్ 1900 లో రెండవ బోయర్ యుద్ధంలో పాల్గొంటున్న తమ దళాలను ప్రోత్సహించేందుకు విక్టోరియా రాణి ఈ చాక్లెట్ పంపించినట్లుగా చరిత్ర చెప్తున్నది. 8 వ బారోనెట్ అయిన సర్ హెన్రీ ఎడ్వర్డ్ పాస్టన్-బేడింగ్ఫీల్డ్కు చెందినదిగా కనుగొన్నారు.
ఈ వస్తువులన్నీ ఆయన గత ఏడాది కన్నుమూయడానికి ముందు తన కుమార్తె ఫ్రాన్సిస్ గ్రేట్హెడ్కు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన కుమార్తెతో కలిసి ఉన్నారు.
సాదా చాక్లెట్ కలిగి ఉన్న 1,00,000 టిన్నులను ఉత్పత్తి చేయడానికి క్యాడ్బరీ, ఫ్రై, రౌంట్రీలను విక్టోరియా రాణి నియమించినట్లు చరిత్ర సూచిస్తున్నది. ప్రతి చాక్లెట్కు ‘దక్షిణాఫ్రికా 1900’ అని ముద్రించారు.
దాని కింది భాగంలో రాణి తన చేతివ్రాతలో ఉన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు అని కూడా రేపర్పై ముద్రించారు. ముగ్గురు తయారీదారులు వీటి కోసం ఎలాంటి చెల్లింపులు తీసుకోవద్దని నిర్ణయించారు. వాటిని బ్రాండెడ్ టిన్లలో ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు.
దక్షిణాఫ్రికాపై నియంత్రణ సాధించడానికి గ్రేట్ బ్రిటన్.. రెండు స్వతంత్ర బోయర్ రాష్ట్రాల మధ్య బోయర్ యుద్ధాలు జరిగాయి. రెండవ బోయర్ యుద్ధం 1899-1902 మధ్య జరిగింది. 1902 మే నెలలో వెరెనిగింగ్ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా బోయర్ పక్షం లొంగిపోయి బ్రిటిష్ నిబంధనలను అంగీకరించడంతో యుద్ధం ముగిసింది.
భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతి వద్దు.. జమ్ముకశ్మీర్తో లింకు పెట్టిన పాక్ క్యాబినెట్
మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్ లీవ్.. వోల్వో ఇండియా నిర్ణయం
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
లింగ సమానత్వంలో అట్టడుగులో భారత్.. ఐస్లాండ్కు తొలిస్థానం
హిమాలయాల్లో 2 టన్నుల చెత్త.. సేకరించిన నేపాల్ పర్వతారోహకులు
కొవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఫ్రాన్స్లో లాక్డౌన్
ప్రజాప్రతినిధుల పని తీరే ఓటేసేందుకు కొలమానం కావాలి: వెంకయ్యనాయుడు
మిలటరీ డెయిరీ ఫాంల మూసివేత.. 132 ఏండ్లు కొనసాగిన ఆర్మీ పాడి
ఆల్ ఫూల్స్ డే.. ఎందుకు..? ఎప్పుడు..? ఎలా..? చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..