నాగర్కర్నూల్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : కందనూలులో నేడు గులాబీ దళపతి అడుగుపెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మూ డురోజుల కిందట బస్సు యాత్రగా బయలుదేరిన కేసీఆర్ శనివారం సాయంత్రం నాగర్కర్నూల్కు చేరుకుంటారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా ప్రచారంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో కేసీఆర్ రాక సరికొత్త ఉత్సాహాన్ని నింపనున్నది. కాంగ్రెస్పై పెరిగిన వ్యతిరేకతతో ప్రజలు కేసీఆర్ యాత్రకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం నా గర్కర్నూల్కు వస్తున్నారు. పార్లమెంట్ ఎ న్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీ ఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ఖరారు చే యగా ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ఇప్పటికే సమావేశా లు నిర్వహించి శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఈ క్రమం లో స్వయంగా కేసీఆర్ నాగర్కర్నూల్కు రానుండడం పార్టీ గ్రామస్థాయి నాయకుల్లోనూ జోష్ను నింపుతున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో 420హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రూపాన్ని నాలుగు మాసాల్లోనే ప్రజలు గ్రహించారు. దీంతో ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆ ర్ మద్దతుతో బరిలో నిలిచిన ఆర్ఎస్ ప్రవీణ్ను స్వచ్ఛందంగా ఆదరిస్తున్నారు. మూడు రోజుల కిందట మిర్యాలగూడలో ప్రా రంభమైన బస్సు యాత్ర శుక్రవారం రాత్రి మహబూబ్నగర్కు చేరుకున్నది. శనివారం సాయంత్రం 6గంటల వరకు కేసీఆర్ కందనూలుకు రానున్నారు. ఉయ్యాలవాడ నుంచి భారీ ఊరేగింపును నిర్వహించనుండగా.. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగించనుండగా.. నియోజకవ ర్గం నుంచి 50వేల మంది ప్రజలు వచ్చే అవకాశమున్నది. కేసీఆర్ నాగర్కర్నూల్ వస్తున్నారని తెలిసిన వెంటనే పార్టీ నాయకులు సోషల్మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలు భారీగా తరలివచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. కాంగ్రెస్పై ప్రజ ల్లో వ్యతిరేకత మొదలై బీఆర్ఎస్పై విశ్వాసాన్ని తిరిగి తీసుకొచ్చింది. ఈ నాలుగు మాసాల్లో నియోజకవర్గంలో ఎలాంటి అ భివృద్ధి జరుగకపోవడంతో ప్రజలు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నా రు. తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకొచ్చి, పదేండ్లపాటు అభివృద్ధి చేసిన కేసీఆర్ రాక కోసం కందనూలు ప్రజలు ఎదురు చూస్తున్నారు.