హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో క్రికెట్కు కొత్త ఊపునిచ్చేందుకు హెచ్సీఏ సమగ్ర రోడ్మ్యాప్ను సిద్ధం చేస్తోంది.జంట నగరాలకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా క్రీడా ప్రతిభను గుర్తించి సరైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందిస్తోందని హెచ్సీఏ జిల్లా క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కమిటీ (సీడీసీఐడీసీ) చైర్మన్ టి. శేష్నారాయణ్ వెల్లడించాడు. బుధవారం ఉప్పల్ సేడియంలో హెచ్సీఏ జిల్లా క్రికెట్ సంఘాల కార్యదర్శుల సమక్షంలో మాట్లాడుతూ.. ‘ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పాైట్లెన జిల్లాలకు హెచ్సీఏ సభ్యత్వం ఇచ్చే ప్రక్రియకు కొంత సమయం పడుతుంది.
ఈలోగా అన్ని జిల్లాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తాం. వీటిలో సహాయక సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ నియమించడంతో పాటు యువ ఆటగాళ్ల కోసం వర్క్షాప్లు నిర్వహించే మాజీ క్రికెటర్లకు వసతి కల్పించే ఏర్పాట్లూ ఉంటాయి. ఇందుకోసం రాబోయే రెండు వారాల్లో తగిన మైదానాలు, కార్యాలయాలను గుర్తించాలని ఆయా జిల్లాల ప్రతినిధులను కోరాం’ అని తెలిపాడు. జోనల్ అకాడమీలను ఏర్పాటు చేయడంతో పాటు, యువ క్రీడాకారులకు తమ సత్తా చాటుకోవడానికి మరో మంచి వేదికను కల్పించేందుకు జోనల్ స్థాయిలో టీ10 టోర్నమెంట్లు నిర్వహించనున్నట్లు వెల్లడించాడు.