హైదరాబాద్ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ల గౌరవ వేతనాన్ని 30% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమస్యలు, నిధులు, విధులు వంటి అంశాలపై ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో 12 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు పలు సమావేశాలు జరిపి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని కవిత తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఉడుముల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
విద్య ద్వారానే సమాజంలో మార్పు : ఎమ్మెల్సీ కవిత
రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం
ప్రజలకు సుపరిపాలన అందించేందుకే కలెక్టరేట్ల నిర్మాణం
పల్లె ప్రగతి పెండింగ్ పనులు 19 లోపు పూర్తి చేయాలి