మహబూబాబాద్ : ఉడుములు పట్టేందుకు వెళ్లి ఓ పెద్ద బండరాయి మధ్యన ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. డోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన జక్కుల వెంకన్న(47) ఉడుములు పట్టేందుకు ఖమ్మం జిల్లా పోలిశెట్టిగూడెం గ్రామ శివారుకు వెళ్లాడు. వేటాడుతున్న క్రమంలో అక్కడున్న పెద్ద బండరాయి మధ్యలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సర్పంచ్, స్థానికులు జేసీబీ సహాయంతో మృతుదేహన్ని బండరాయి మధ్యలో నుంచి తీశారు. వెంకన్నకు భార్య, కుమారై ఉన్నారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు ఖమ్మం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
విద్య ద్వారానే సమాజంలో మార్పు : ఎమ్మెల్సీ కవిత
రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం
ప్రజలకు సుపరిపాలన అందించేందుకే కలెక్టరేట్ల నిర్మాణం
పల్లె ప్రగతి పెండింగ్ పనులు 19 లోపు పూర్తి చేయాలి