వరంగల్ అర్బన్ : రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలనను మరింత చేరువ చేసేందుకే నూతన కలెక్టరేట్లను నిర్మిస్తున్నామని పంచాయతీ రాజ్, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. హన్మకొండలో సిద్ధమవుతున్న నూతన సమీకృత కలె క్టరేట్ భవనాన్ని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21న జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న వరంగల్ అర్బన్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. అదే విధంగా 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి కూడా భూమి పూజ చేస్తారని మంత్రి తెలిపారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ భవనానికి 35 కోట్ల రూపాయల తో అంచనాలు రూపొందించగా.. దాదాపు 57 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అయినట్లు తెలిపారు.
ఈ కలెక్టరేట్ కాంప్లెక్స్ మొత్తం దాదాపు ఒక లక్షా 57 వేల అడుగుల విస్తీర్ణం కలిగి ఉందని వివరాలను వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నిర్మిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, అభివృద్ది కోసమే చిన్న జిల్లాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, సీసీఎఫ్ ఆశ, డీఎఫ్ఓ అర్పన, డీఆర్వో వాసు చంద్ర, ఆర్ అండ్ బీ ఎస్ఈ. నాగేందర్ రావు అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
విద్య ద్వారానే సమాజంలో మార్పు : ఎమ్మెల్సీ కవిత
రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం
శ్రీలంక పర్యటనకు కోచ్గా రాహుల్ ద్రవిడ్ ఖరారు
పల్లె ప్రగతి పెండింగ్ పనులు 19 లోపు పూర్తి చేయాలి