నల్లగొండ: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై చెన్నూరు ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. నిన్న హాలియాలో జరిగిన కాంగ్రెస్ సభ జానారెడ్డి భజన సభలా సాగిందని విమర్శించారు. కాంగ్రెస్ ఓ ఔట్ డేటెడ్ పార్టీ, కాంగ్రెస్ గతం.. జానారెడ్డి గతం అని ఎద్దేవాచేశారు. జానారెడ్డిని ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని చెప్పారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు టీఆర్ఎస్సేనని చెప్పారు. ఆయన ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, కోనేరు కోనప్ప, పార్టీ నేత తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో కలిసి హాలియాలో మీడియాతో మాట్లాడారు.
ఏడుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి ఇన్నేండ్లు నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను ఎందుకు తీర్చలేకపోయారని సుమన్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్లోరైడ్ సమస్యను తీర్చిందని కేంద్ర మంత్రులే ప్రశంసిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఉదయ సముద్రం, ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.70 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం నెల్లికల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిందన్నారు. 960 చెరువులను రెండు సీజన్లకు నీటిని నింపుతున్నదని చెప్పారు. ఎస్సారెస్పీ స్టేజ్-2 పూర్తిచేసి 3.5 లోల ఎకరాలకుపైగా సాగునీళ్లిచ్చామన్నారు. జానారెడ్డి మండలానికో సామంతరాజును పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో తండాలను పంచాయతీలుగా ఎందుకు మార్చలేదన్నారు.
బీజేపీ నేతలకు ఓటువేస్తే సాగర్లో ఉన్న నీళ్లను మనకే అమ్మేస్తారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేయొద్దని కార్మికులు ఆందోళన చేస్తుంటే పట్టింపులేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీకి ఓటు వేస్తే తప్పుడు నిర్ణయాలకు ఓటు వేసినట్టేనని చెప్పారు. బీజేపీ ప్రభుత్వానికి కర్ణాటక, యూపీ రాష్ట్రాలపై ఉన్న ప్రేమ తెలంగాణపై లేదా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మరి తెలంగాణలోని కాలేశ్వరం, పాలమూరు-రంగారెడ్డికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వరని ప్రశ్నించారు. మోదీ గడ్డం పెరిగినట్లు దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.
నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సాగర్ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని ఆయన చెప్పారు. జానారెడ్డికి పక్క వాళ్లను గౌరవించడం తెలియదని ఎమ్మెల్యే కోనేరు కొనప్ప విమర్శించారు. ఓడిపోతున్నానే బాధలో జానారెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతున్నాడని చెప్పారు. అధికారంలో ఉన్నపుడు గుర్తుకురాని ప్రజలు ఇప్పుడు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దేశంలో కొత్తగా 62 వేల కరోనా కేసులు
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్గివెన్ షిప్ కాస్త కదిలింది
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!