నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందలా ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మహానటి సినిమాతో అశేష ప్రేక్షకాదరణ పొందిన కీర్తి రీసెంట్గా రంగ్ దే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కీర్తి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే రిలీజ్కు ముందుకు మూవీ ప్రమోషన్లో భాగంగా సెట్స్లో సరదాగా జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ వచ్చారు.
నితిన్, కీర్తిలు ఒకరినొకరు ఆటపట్టించుకోవడం, కీర్తి తప్పిపోయిందని నితిన్ ట్వీట్ చేయడం, రకరకాల చీరలలో కీర్తి సురేష్ కనిపించడం, అమితమైన ఆహారాన్ని కీర్తి సురేష్ ఒక్కతే తినడం వంటి వీడియోలు షేర్ చేయగా, ఇవి నెటిజన్స్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా కీర్తి సురేష్ తన ఇన్స్టాగ్రాములో బోట్ కోసం పరుగెత్తుతున్న వీడియోను షేర్ చేస్తూ.. వీకెండ్ కోసం పరిగెత్తుతున్నాను అని క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం కీర్తి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.