న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న 62 వేల మంది కరోనా బారినపడగా, గత 24 గంటల్లో మరో 62,714 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,71,624కు చేరింది. ఇందులో 1,13,23762 మంది బాధితులు వైరస్ బారినుంచి బయటపడ్డారు. మరో 1,61,552 మంది మృతిచెందారు.
కరోనా బాధితులతోపాటు యాక్టివ్ కేసుల సంఖ్యకూడా క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 4,86,310 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 312 మంది కరోనా బాధితులు మరణించారు. కొత్తగా 28,739 మంది డిశ్చార్జీ అయ్యారు. కాగా, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. నిన్నటివరకు 6,02,69,782 మంది కరోనా టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ప్రణాంతక వైరస్ మళ్లీ పంజా విసురుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విస్తృతంగా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలో నిన్న ఒక్కరోజే 11,81,289 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. దీంతో మార్చి 27 వరకు మొత్తం 24,09,50,842 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
నిజాంపేట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులను ఢీకొట్టిన కార్లు