న్యూఢిల్లీ: చైనా సరిహద్దు ప్రాంతంలో భారత ఆర్మీ జవాన్లు డ్యాన్స్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఈ నెల 25న ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘సైనికులు ఆనందించినప్పుడల్లా గొప్పగా అనిపిస్తుంది. ధైర్య వంతులైన ఆర్మీకి చెందిన గోర్ఖా జవాన్లు లడఖ్లోని పాంగోంగ్ త్సో సరస్సు వద్ద మ్యూజిక్, డ్యాన్సులతో ఉల్లాసంగా గడిపారు’ అని అందులో పేర్కొన్నారు.
మరోవైపు భారత జవాన్లు డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. పలువురు నెటిజన్లు భారత సైనికుల ధైర్యసాహసాలను కీర్తించారు. జైజవాన్, జైహింద్ అంటూ వారికి సంఘీభావం తెలిపారు. రియల్ హీరోల డ్యాన్స్ చూసి పరవశించినట్లు కొందరు పేర్కొన్నారు.