Earthqauke | అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. రాంబిల్లి, ఎలమంచిలి, కోటఉరట్ల మండలాల్లో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై వీటి తీవ్రత 3.7గా నమోదైంది. అర్ధరాత్రి 12.05 గంటలకు ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
విశాఖపట్నం రాసపూడిపాలెం ప్రాంతానికి నైరుతి దిశలో 50 కిలోమీటర్లు దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ధ్రువీకరించింది.