Assam Floods : అస్సాం (Assam) లో వరదలు (Floods) బీభత్సం సృష్టించాయి. ఈ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 95 కి చేరింది. ఈ వరదలవల్ల రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. చాలా ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఇప్పటికీ 365 కిపైగా గ్రామాలు నీట మునిగే ఉన్నాయి. సుమారు 1.22 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా 15 వేలకుపైగా ఎకరాల్లో పంట భూమి దెబ్బతిన్నది.
విపత్తు తీవ్రతను పరిశీలించేందుకు అస్సాం సీఎం హిమాంత కేంద్రమంత్రి జేపీ నడ్డాతో కలిసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మరోవైపు పొరుగు రాష్ట్రాలైన మేఘాలయ, అరుణాచల్ప్రదేశ్లలో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దాంతో అస్సాంలో మళ్లీ వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.