దుబాయ్: భారత యువ స్పిన్నర్ శ్రీచరణి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అగ్రస్థానాన కొనసాగుతున్న ఈ తెలుగమ్మాయి.. తాజాగా 800 రేటింగ్ పాయింట్ల మార్కును దాటి కెరీర్లో అత్యుత్తమ రేటింగ్(804) సాధించింది. ఆసియా కప్ ఫైనల్లో 4 వికెట్లు తీయడమే గాక టోర్నీ ఆసాంతం రాణించిన చరణి టాప్ ప్లేస్నుమరింత పటిష్టం చేసుకుంది.
దాంతోపాటు 800 రేటింగ్ పాయింట్లు సాధించిన భారత మహిళా క్రికెటర్గా రికార్డులకెక్కింది. 2011లో నాటి సారథి మిథాలీ రాజ్ 780 పాయింట్లు సాధించడమే ఇప్పటిదాకా భారత్ తరఫున అత్యుత్తమం. కాగా చరణి మరో మూడు పాయింట్లు సాధిస్తే టీ20 ర్యాంకింగ్స్లో ఆల్టైమ్ హై రేటింగ్ పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా బౌలర్ మేగన్ షట్ (2018లో 806) రికార్డును అధిగమిస్తుంది.