పాట్నా: గంగా నదిపై నిర్మిస్తున్న వంతెనకు చెందిన స్లాబ్ కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. (Bridge Slab collapses) బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గంగా నదిపై నిర్మిస్తున్న వంతెనకు చెందిన ఒక స్లాబ్ భాగం శనివారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, బీహార్లో ఇటీవల కురిసిన వర్షాలకు భాగల్పూర్లో విక్రమశిల సేతు వంతెనపై కొంత భాగం కూలిపోయింది. దీంతో దక్షిణ బీహార్, సీమాంచల్ ప్రాంతాల మధ్య రవాణా సంబంధాలు తెగిపోయాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వీవో) మరమ్మతు పనులు చేపట్టింది. దెబ్బతిన్న ప్రాంతంలో రెండు తాత్కాలిక బెయిలీ వంతెనలను కూడా నిర్మిస్తోంది. ఇది జరిగిన నెల వ్యవధిలోనే తాజాగా నిర్మాణంలో ఉన్న వంతెన స్లాబ్ కూలడం కలకలం రేపింది.