ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ వాల్వు లీకయ్యింది. రిమ్స్ సమీపంలో ఉన్న భగీరథ పైపులైన్ వాల్వ్ను ఇవాళ ఉదయం ఓ పాల వ్యాను ఢీకొట్టింది. దీంతో వాల్వు ఊడి 50 అడుగుల ఎత్తులో నీరు ఎగిరిపడింది. భారీగా నీరు బయటకు వస్తుండటంతో వాల్వు పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈనేపథ్యంలో పట్టణానికి నీటి సరఫరా నిలిచిపోయింది. కాగా, సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదిక లీకేజీకి మరమ్మతులు చేపట్టారు. అయితే నీరు అంతెత్తుకు దూకుతుండటంతో.. దానిని చూడటానికి జనం భారీగా తరలి వచ్చారు. వాటర్ లీకేజీకి కారణమైన వ్యాన్ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.