అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ బిడ్డలకు ఆరోగ్యలక్ష్మిని పక్కాగా అమలుచేయాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. మంగళవారం సంక్షేమభవన్లో ఆమె గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్చోంగ్తూ, స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్, గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో సమీక్షించారు. ఆదివాసీ గిరిజన బిడ్డలకు ఆరోగ్యలక్ష్మి ద్వారా అదనపు పోషకాహారాన్ని అందించేందుకు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆమె చెప్పారు. ప్రభుత్వం బడ్జెట్లో ఈ రెండు శాఖలకు గతంలో కంటే అధిక నిధులు కేటాయించిందని, వాటిని సమర్థంగా వినియోగించాలని సూచించారు. కొవిడ్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటింటికీ రేషన్ను మరింత పటిష్ఠంగా అమలుచేయాలని ఆమె ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
ట్రేడ్ లైసెన్స్ లేకుంటే 100% పెనాల్టీ