రెన్యువల్కు నేడే తుది గడువు: జీహెచ్ఎంసీ
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30(నమస్తే తెలంగాణ):ట్రేడర్లు ట్రేడ్ లైసెన్స్ పొందకుండా వ్యాపారాలు నిర్వహిస్తే 100శాతం పెనాల్టీతోపా టు నెలకు 10శాతం అదనపు పెనాల్టీ విధిస్తామని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. గ్రేటర్లో 1,66,165 టిన్ నంబర్లు ఉన్నాయని, 1,08,605 టిన్నంబర్ లేనివిగా ఉన్నాయని తెలి పింది. లైసెన్స్రెన్యువల్కు బుధవా రం వరకు మాత్రమే అవకాశం ఉన్నదని, జాప్యం చేస్తే లైసెన్స్ ఫీజుకు అదనంగా అపరాధ రుసుం విధిస్తామని పేర్కొన్నది. ఇప్పటివరకు హైదరాబాద్లో 19,530 మంది ట్రేడర్లు మాత్రమే లైసెన్స్ను రెన్యువల్ చేసుకున్నారని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఆదివాసీ బిడ్డలకు పక్కాగా ఆరోగ్యలక్ష్మి