న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరీ ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 56,211 కొత్త కేసులు నమోదు కాగా, అందులో 78.56 శాతం కేసులు మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలోనే బయటపడ్డాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం వెల్లడించింది.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడిన 56,211 మంది బాధితుల్లో మహారాష్ట్రకు చెందిన వారు 31,643 మంది, పంజాబ్కు చెందిన వారు 2,868 మంది, కర్ణాటకకు చెందిన వారు 2,792 మంది, మధ్యప్రదేశ్కు చెందిన వారు 2,323 మంది, తమిళనాడుకు చెందిన వారు 2,279 మంది, గుజరాత్కు చెందిన వారు 2,252 మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మమతాబెనర్జికి ఓటమి భయం పట్టుకుంది: కేంద్ర మంత్రి
ఆక్సిజన్ పైప్తో ఉరేసుకుని కొవిడ్ బాధితుడి ఆత్మహత్య
ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ కౌన్సిలర్ మృతి
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
భారత మహిళా క్రికెటర్ హర్మన్ప్రీత్ కౌర్కు కరోనా పాజిటివ్