శ్రీనగర్ : నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రెసిడెంట్, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కరోనా పాజిటివ్గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. వైరస్కు పాటివ్గా పరీక్షించారని, కొన్ని లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర కుటుంబీకులతో కలిసి క్వారంటైన్లో తాను సైతం సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటానని తెలిపారు. ఇటీవల తమను కలిసిన వారంతా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..