అనుసంధానానికి ఈ నెల 31 వరకే గడువు
న్యూఢిల్లీ, మార్చి 29: పాన్కార్డుతో ఆధార్ నంబర్ను ఇంకా అనుసంధానం చేయలేదా.. అయితే వెంటనే చేసేయండి. మూడు రోజులే గడువు ఉంది. ఈ నెల 31లోగా పాన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదు. అంతే కాకుండా రూ.1000 జరిమానా పడుతుంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఐటీ చట్టానికి సవరణలు చేసింది. పాన్కార్డుకు ఆధార్ లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. అయితే ఆధార్ నంబర్ లింక్ చేయకపోతే జరిమానా పడుతుందా.. తిరిగి లింక్ చేసుకోవాలంటే జరిమానా కట్టాల్సి ఉంటుందా అన్న విషయాన్ని చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు. దీనిపై కేంద్రం ప్రత్యేకంగా ప్రకటన జారీచేయనున్నట్టు తెలుస్తున్నది. ఆదాయ పన్ను విభాగం సైట్ https://www.incometaxindiaefiling.gov.in/home, NSDL, UTI వెబ్సైట్ల ద్వారా పాన్కార్డుతో ఆధార్ నంబర్ను లింక్ చేయవచ్చు.
ఇవీ కూడా చదవండి..
బీజేపీ ఎమ్మెల్యేను గుడ్డలూడదీసి కొట్టి..
ఏప్రిల్ 1 నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ షురూ!