పంజాబ్లో రైతుల దాడి
చండీగఢ్, మార్చి 27: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు పంజాబ్లోని ముక్తసర్ జిల్లా మలోట్లో ఓ బీజేపీ ఎమ్మెల్యేను చితకబాదారు. ఆయన దుస్తులను చించేశారు. శనివారం మీడియా సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే అరుణ్ నారంగ్ను అన్నదాతలు చుట్టుముట్టారు. ఆయనపై నల్ల ఇంకు చల్లారు. ఎమ్మెల్యేను చితకబాది, దుస్తులను చించేశారు. దాడి ఘటనను సీఎం అమరీందర్సింగ్ ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఎమ్మెల్యేపై దాడి ఘటనను సంయుక్త కిసాన్మోర్చా ఖండించింది. ఇలాంటి ధోరణిని తాము ప్రోత్సహించబోమని, రైతులు శాంతియుతంగా నిరసన తెలుపాలని సూచించింది.