Leopard | మెదక్ అర్బన్, జులై 26 : మెదక్- రామాయంపేట్ రోడ్డుపై చిరుతపులి విగత జీవిగా పడి ఉంది. ఆదివారం ఉదయం 10: 30 గంటల ప్రాంతంలో హవేలి ఘనాపూర్ మండలంలోని గంగాపూర్ రాజేశ్వర్ స్వామి దేవాలయం సమీపంలో చిరుతపులి రక్తపు మడుగులో ప్రాణాలు విడిచింది. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులిని పరిశీలించారు.
గంగాపూర్ సమీపంలో అడవి ప్రాంతం ఉండడంతో అక్కడ సంచరిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుతపులి మృతి చెందినట్లు ఈ ప్రమాదం జరిగిందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కాగా చిరుత పులి మృతిపై అటవీశాఖ అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.