తిరువనంతపురం, మే 7: కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. త్రిస్సూర్, మలప్పురం, కొజికోడ్ జిల్లాల్లో తాజాగా ‘వెస్ట్ నైల్’ ఫీవర్ కేసులు నమోదైనట్టు కేరళ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. క్యూలెక్స్ దోమలతో ఈ జ్వరాలు వస్తున్నాయని, వీటి నివారణకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని అందులో సూచించారు.