కైరో: గ్రహాలు అనుకూలిస్తేనే ఏదైనా సాధ్యం. దీన్ని నమ్మకపోయినా.. సుయెజ్ ఘటన ఆ నిజాన్నే చెబుతోంది. కాలువలో ఇరుక్కున్న భారీ ఎవర్ గివెన్ నౌక ఎట్టకేలకు ఆరు రోజుల తర్వాత స్థాన చలనం చెందిన వి షయం తెలిసిందే. 1300 ఫీట్ల వెడల్పు ఉన్న ఆ నౌకను కదిలించేందుకు .. మహా యంత్రాంగమే రంగంలోకి దిగింది. అడ్డంగా చిక్కుకున్న నౌక వల్ల వేల కోట్ల వ్యాపారం స్తంభించిపోయింది. ఆ నౌకను మళ్లీ దారిలో పెట్టేందుకు ఊహించని స్థాయిలో డ్రెడ్జింగ్ చేపట్టారు. టగ్ బోట్లతో ఆ సరుకు నౌకను కదలించే ప్రయత్నమూ చేశారు. కానీ ఆ ఇంజినీర్ల కృషి.. ప్రకృతి వల్లే ఫలించిందనడం ఆశ్చర్యం కాదు. పున్నమి రోజున ఆటుపోట్లు తెలిసిందే. ఆదివారం సూపర్మూన్ కావడంతో.. భారీ అలలు వచ్చాయి. డ్రెడ్జింగ్కు అలలు తోడు కావడంతో.. ఎవర్ గివెన్ నౌక సముద్ర నీటిలో ఈజీగా తేలినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పున్నమి చంద్రుడే వల్లే నౌక కదిలిందన్న ఊహాగానాలు బలపడుతున్నాయి.
సుయెజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక కదిలినా.. అసలు ఆ నౌక ఎందుకు అక్కడ అలా చిక్కుకుపోయిందో తెలుసుకునేందుకు ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎవర్ గివెన్ నౌక స్తంభించడం వల్ల సుమారు 369 బోట్లు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. మధ్యదరా, ఎర్ర సముద్రంలో ఆ నౌకలు ఆగిపోయాయి. అవన్నీ క్లియర్ అయ్యేందుకు మరింత సమయం పడుతుంది. దీంతో భారీ స్థాయిలో వాణిజ్య నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇసుక తుఫాన్ వల్ల నౌక ఒక పక్కకు ఒరిగినట్లు చెబుతున్నా.. ఆ అంశాన్ని అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు.