WTC Points Table : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో భారత జట్టు(Team India) మళ్లీ నంబర్ 1 స్టానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన పెర్త్ టెస్టులో పాకిస్థాన్(Pakistan) ఓటమితో రెండో స్థానంలో ఉన్న టీమిండియాకు కలిసొచ్చింది. ఇక ఆసీస్ చేతిలో భారీ ఓటమితో పాక్ రెండో స్థానానికి పడిపోయింది.
ప్రస్తుతం భారత్, పాక్ 66.67 శాతం విజయాలతో ఉన్నాయి. 50 శాతం విజయాలతో న్యూజిలాండ్ మూడో స్థానంలో నిలిచింది. స్వదేశంలో కివీస్పై చారిత్రాత్మక టెస్టు విజయం సాధించిన బంగ్లాదేశ్ నాలుగు, ఆస్ట్రేలియా ఐదు, వెస్టిండీస్ ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
India are now the Table Toppers of WTC Points Table…!!! pic.twitter.com/wr6nDV1LOo
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2023
వరుసగా రెండు సార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన టీమిండియా అనూహ్యంగా ఆఖరి మెట్టుపై తడబడింది. దాంతో ఈసారి ఎలాగైనా టెస్టు గద(Test Mace)ను దక్కించుకోవాలని భారత ఆటగాళ్లు కసితో ఉన్నారు. డబ్ల్యూటీసీ 2023 -25 సైకిల్లో భాగంగా వచ్చే ఏడాది భారత్ 16 టెస్టులు ఆడనుంది.
ప్రస్తుతం రోహిత్ శర్మ(Rohit Sharma) నేతృత్వంలోని భారత్ రెండు టెస్టుల సిరీస్ కోసం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. డిసెంబర్ 26 నుంచి ఇరుజట్ల మధ్య టెస్టు సమరం షురూ కానుంది. వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. నాలుగు టెస్టుల సిరీస్లో మొదటి టెస్టు జనవరి 25న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది.