న్యూఢిల్లీ : పారాలింపిక్ షూటర్ నరేశ్ కుమార్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన పేరును పారాలింపిక్స్కు పంపే జట్టులో చేర్చాలని పారాలింపిక్ కమిటీని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. 50 మీటర్ల షూటింగ్కు అదనపు భాగస్వామిగా నరేశ్ కుమార్ శర్మ (Paralympics Shooter) పేరును సిఫారసు చేయాలని భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) ని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. రేపటిలోగా సమ్మతి నివేదిక ఇవ్వాలని కోర్టు కోరింది.
అంతకుముందు నరేశ్ కుమార్ శర్మ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ త్రిసభ్య ధర్మాసనానికి సూచించారు.
ఈ నెల 24 నుంచి పారాలింపిక్స్ టోక్యోలోనే జరుగనున్నాయి. ఈ పోటీలకు ఎంట్రీల గడువు ముగిసిన నాలుగు రోజుల తర్వాత తన పిటిషన్ను శుక్రవారం విచారణ జరుపుతామని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది. ఈ ఆదేశాన్ని సవాలు చేస్తూ శర్మ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఐదుసార్లు పారాలింపిక్స్ షూటర్గా నిలువడమే కాకుండా అర్జున అవార్డును సొంతం చేసుకున్న నరేశ్ కుమార్ శర్మను 50 మీటర్ల షూటింగ్కు ఎంపిక చేయలేదు. మరొక అథ్లెట్ దీపక్కు అనుకూలంగా ఉండేందుకే తనను పక్కన పెట్టారని, టోక్యో పారాలింపిక్స్ ఆర్7 ఈవెంట్లో పాల్గొనడానికి తనకు చట్టబద్ధమైన అవకాశం ఉన్నదని పిటిషనర్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 6 న శుక్రవారం కేసు విచారణ జరిపితే ఎంట్రీల గడువు ముగిసి తనకు అన్యాయం జరుగుతుందని కోర్టుకు తెలిపారు.
ఎంపిక ప్రమాణాలలో విఫలమవడం వల్లనే నరేశ్ కుమార్ పేరును పరిశీలనకు తీసుకోలేకపోయామని భారత పారాలింపిక్ కమిటీ కోర్టుకు స్పష్టం చేసింది. అథ్లెట్ల ఎంపిక కోసం పీసీఐ సెలెక్షన్ కమిటీ తప్పుడు ప్రమాణాలను స్వీకరించిందని, జాతీయ క్రీడాభివృద్ధి కోడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని నరేశ్ కుమార్ శర్మ ఆరోపించారు.
పెగాసస్పై దర్యాప్తు చేయాలి : సీఎం నితీష్ కుమార్
ఇక్కడ ముద్దులు నిషేధం.. ముంబైలో స్పెషల్ జోన్
ఈ చట్టం కింద ఇంకా కేసులా?.. సుప్రీంకోర్టు షాక్
స్పెషల్ ఒలింపిక్స్లో ఇండియాకు సోనూ సూద్ నాయకత్వం
చరిత్రలో ఈరోజు.. భారత ప్రభుత్వ చట్టం ఆమోదం
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..