పాట్నా : ‘పెగాసస్ కుంభకోణం’ పార్లమెంట్ను కుదిపేస్తున్నది. ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ఆదేశించారు. కాగా, విపక్షాల డిమాండ్కు దన్నుగా స్వపక్షం నుంచి కూడా డిమాండ్ రావడం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనతాదళ్ (యునైటెడ్) పార్టీకి చెందిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) నుంచే ఈ డిమాండ్ రావడం విశేషం.
‘ప్రజలను ఇబ్బంది పెట్టడానికి, వేధించడానికి ఇలాంటివి చేయకూడదు. మొత్తం విషయాన్ని బహిరంగపరచాలి’ అని నితీష్ కుమార్ అన్నారు. ఈ అంశాన్ని దర్యాప్తు జరుపాలా? అని ప్రశ్నించగా.. వాస్తవానికి జరుగాలని నితీష్ సమాధానమిచ్చారు.‘చాలా రోజులుగా టెలిఫోన్ ట్యాపింగ్ గురించి చర్చ జరుగుతున్నది. ఈ విషయం పార్లమెంటులో లేవనెత్తారు. మీడియాలో వార్తా నివేదికలు వచ్చాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా చర్చించి పరిశీలించాలి. మొత్తం విషయాన్ని బహిరంగపరచాలి’ అని సీఎం నితీష్ కుమార్ మీడియాతో అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 17 మీడియా సంస్థల కన్సార్టియం నివేదికల తర్వాత గత నెలలో చెలరేగిన ఈ వివాదం.. భారతదేశంలో భారీ రాజకీయ వివాదంగా మారింది. పార్లమెంటులో చర్చ కోసం విపక్షాలు చేతులు కలిపాయి. వర్షాకాల సెషన్ మొత్తం ఇదే వ్యవహారంతో తుడిచిపెట్టుకుపోయేట్లుగా ఉన్నది. చట్టవిరుద్ధమైన అంతరాయమేమీ జరగలేదని మాత్రమే ప్రభుత్వం పార్లమెంటులో ఒక ప్రకటన చేసింది. అయితే, పార్లమెంటు ఉభయ సభల్లో ఇప్పటివరకు ఈ అంశంపై ఎలాంటి చర్చ జరుగలేదు.
ఇక్కడ ముద్దులు నిషేధం.. ముంబైలో స్పెషల్ జోన్
ఈ చట్టం కింద ఇంకా కేసులా?.. సుప్రీంకోర్టు షాక్
స్పెషల్ ఒలింపిక్స్లో ఇండియాకు సోనూ సూద్ నాయకత్వం
చరిత్రలో ఈరోజు.. భారత ప్రభుత్వ చట్టం ఆమోదం
ఇక రాయితో కొట్టారో.. కఠిన చర్యలు తప్పవు!
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..