హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్నది. దీంతో జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలతోపాటు అన్నిరకాల ఎగ్జామ్స్ వాయిదాపడుతూ వస్తున్నాయి. ఈ లిస్ట్లో మరో ప్రవేశపరీక్ష చేరింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు సైనిక స్కూళ్లలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నిర్ణయం తీసుకున్నది. 2021–22 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం కోసం ఈ నెల 30న నిర్వహించనున్న ఈ పరీక్షను పోస్ట్పోన్ చేస్తున్నట్లు సంస్థ కార్శదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. పరీక్ష తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..