ఐజ్వాల్ : తమ భర్త చనిపోలేదంటున్నారు మిజోరాంకు చెందిన 38 మంది భార్యలు. దాంతో ఆయన అంత్యక్రియలు నిలిచిపోయాయి. తమ భర్త ఇంకా సజీవంగానే ఉన్నాడని, ఆయన శరీరం వేడిగా ఉండి శ్వాస ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నదని వారు చెప్తున్నారు. ఫలితంగా రెండు రోజుల క్రితం చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించినా.. ఇంకా అంత్యక్రియలు చేయకుండా అలాగే ఉంచారు.
ప్రపంచంలోని 167 మంది సభ్యులతో అతిపెద్ద కుటుంబంగా వరల్డ్ రికార్డుల్లోకెక్కిన మిజోరాంకు చెందిన జియోనా చానా కుటుంబం ఆయన మరణాన్ని నమ్మడం లేదు. జియోనా చానా ఇంకా బతికే ఉన్నాడని, ఊపిరి పీల్చుకుంటున్నట్లు కుటుంబం నమ్ముతున్నది. దాంతో చానా అంత్యక్రియలు నిలిచిపోయాయి. పావల్ శాఖకు చానా నాయకుడు. ఆయన తండ్రి ఈ విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఈ విభాగంలో 433 కుటుంబాలు, 2,500 మందికి పైగా సభ్యులు ఉన్నారు. జియోనా చానా మరణాన్ని ధ్రువీకరించనంత వరకు చివరి కర్మలు చేయకూడదని మత పెద్దలు అంటున్నారు. మిజోరాం రాజధాని ఐజ్వాల్లోని ట్రినిటీ హాస్పిటల్ వైద్యులు జూన్ 13 న చానా మరణాన్ని ధ్రువీకరించారు. అతడి వయసు 76 సంవత్సరాలు. వృత్తిపరంగా వడ్రంగి అయిన చానాకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు ఉన్నారు.
చెస్ట్ ప్యాచ్ : దవాఖాన నుంచే కొవిడ్ రోగుల పర్యవేక్షణ
మార్చొద్దు : యెడ్డికి మద్దతుగా లింగాయత్ పీఠాధిపతులు
అమెజాన్ అండ : ఇంజినీరింగ్ విద్యార్థులకు మెషిన్ లెర్నింగ్ స్కిల్స్
క్లాట్ 2021 : పరీక్ష తేదీని ప్రకటించిన కన్సార్టియం
ఏనుగుల దాడి : జైలులో గ్రామస్థుల బస
కొత్త అలారం : 15 నిమిషాల్లో కరోనా గుర్తింపు..!
గైర్హాజరు ఎందుకో : బెంగాల్ బీజేపీలో ముదురుతున్న సంక్షోభం
చరిత్రలో ఈరోజు : గల్వాన్ వీరులకు వందనం
గోర్లను చూసి డయాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..