చికాగో : కరోనా రోగులను ఇకపై దవాఖాన నుంచే పర్యవేక్షించేందుకు అమెరికన్ శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన సెన్సార్ను సిద్ధం చేశారు. ఇంట్లో ఉండే వ్యక్తుల కొవిడ్ లక్షణాలను పర్యవేక్షించేందుకు ఈ సెన్సార్ ద్వారా వీలు చిక్కనున్నది. సెన్సార్ ప్రత్యేక రకమైన ప్యాచ్గా మార్చబడింది. ఈ ప్యాచ్ను రోగి ఛాతీపై ఉంచి మొబైల్ ఫోన్తో కనెక్ట్ అయి ఉంటుంది. తద్వారా రోగిలో ఆక్సిజన్ స్థాయి, హృదయ స్పందన రేటును రియల్టైమ్లో మొబైల్ ఫోన్ స్క్రీన్పై చూడవచ్చు.
ఈ సెన్సార్ను అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయం, డిజిటల్ మెడిసిన్ స్టార్టప్ ఫీజీఐక్యూ సంయుక్తంగా తయారు చేశాయి. ఈ సెన్సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. ఈ సెన్సార్ సహాయంతో రోగిని సుదూర దవాఖానలో కూర్చున్న వైద్యుడు పరీక్షించవచ్చు. రోగి శరీరంలో మార్పులు కనిపించినప్పుడు పరిస్థితి మరింత దిగజారక ముందే రోగిని అప్రమత్తం చేస్తారు. వారిని సకాలంలో హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందించేందుకు, అదేవిధంగా దవాఖానల్లో అనవసర రద్దీని తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. పెరుగుతున్న ఇన్ఫెక్షన్ కారణంగా పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ఈ ప్యాచ్కు పల్స్ ఆక్సిమీటర్, సెన్సార్ ఉన్నాయి. సెన్సార్ మొబైల్ ఫోన్లో ఉన్న బ్లూటూత్కు కనెక్ట్ చేయబడుతుంది. దీని ద్వారా మొబైల్లో ఆక్సిజన్ లేదా హృదయ స్పందనలో మార్పులు చూడవచ్చు. ఏదైనా పొరపాటు ఉంటే వైద్యులకు సందేశం పంపుతుంది.
మార్చొద్దు : యెడ్డికి మద్దతుగా లింగాయత్ పీఠాధిపతులు
అమెజాన్ అండ : ఇంజినీరింగ్ విద్యార్థులకు మెషిన్ లెర్నింగ్ స్కిల్స్
క్లాట్ 2021 : పరీక్ష తేదీని ప్రకటించిన కన్సార్టియం
ఏనుగుల దాడి : జైలులో గ్రామస్థుల బస
కొత్త అలారం : 15 నిమిషాల్లో కరోనా గుర్తింపు..!
గైర్హాజరు ఎందుకో : బెంగాల్ బీజేపీలో ముదురుతున్న సంక్షోభం
చరిత్రలో ఈరోజు : గల్వాన్ వీరులకు వందనం
గోర్లను చూసి డయాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..