చండీగఢ్: స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన బాలికను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తాత, నానమ్మ చేతుల్లోంచి లాక్కెళ్లారు. కారులో తీసుకెళ్లారు. తాత, నానమ్మ ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది. (girl kidnapped) పంజాబ్లోని మొహాలీలో ఈ సంఘటన జరిగింది. నాలుగేళ్ల బాలికను తాత, నానమ్మ కలిసి స్కూల్ నుంచి స్కూటీపై ఇంటి వద్దకు తీసుకువచ్చారు. వృద్ధురాలు గేటు తీస్తుండగా మరో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. తాత వద్ద ఉన్న బాలికను తీసుకునేందుకు ప్రయత్నించారు.
కాగా, అంతలోనే ఒక కారు అక్కడకు చేరుకున్నది. కారు నుంచి దిగిన వ్యక్తులు ఆ బాలికను కిడ్నాప్ చేశారు. ఆ చిన్నారిని లాక్కొని కారులోకి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ కారును అడ్డుకునేందుకు తాత, నానమ్మతో పాటు కొందరు స్థానికులు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ వ్యక్తులు కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు ప్రభుత్వ స్కూల్లో టీచర్ అయిన బాలిక తండ్రి తన కుమార్తె కిడ్నాప్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యతో వైవాహిక వివాదం వల్ల కుమార్తె కస్టడీపై కోర్టులో విచారణ కొనసాగుతున్నదని ఆయన తెలిపారు. అయినప్పటికీ తన భార్య ఈ కుట్రకు పాల్పడిందని ఆరోపించాడు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని పోలీసులను ఆయన కోరారు. అయితే ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన బాలిక కిడ్నాప్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Shocking CCTV from Kurali, Mohali (May 19): 4.5-year-old girl taken in broad daylight in front of her grandparents by people in a white car. Family custody dispute from mother’s side. Police investigating.” pic.twitter.com/6rihEnK06U
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 20, 2026