High Court | ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను పోలీసులు హైకోర్టులో హాజరు పరిచారు. కంటోన్మెంట్ బోర్డు నిధుల వ్యవహారంలో సందీప్ సుల్తానియాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు ఆదేశింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సందీప్ సుల్తానియాను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కాగా, కంటోన్మెంట్ బోర్డుకు కొన్ని నిధులు విడుదల చేశామని, మిగతా నిధులు పలు విడతల్లో విడుదల చేస్తామని సుల్తానియా కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల వల్ల అధికారులు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాను కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు
కంటోన్మెంట్ బోర్డు నిధుల వ్యవహారంలో సందీప్ సుల్తానియాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు
ఈరోజు ఉదయం సందీప్ సుల్తానియాను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు… https://t.co/M2X8r9r7Do pic.twitter.com/i7wwNUx5Dh
— Telugu Scribe (@TeluguScribe) August 7, 2026