సనా : సౌదీ అరేబియా వైమానిక స్థావరంపై ఇటీవల జరిగిన డ్రోన్ దాడికి యెమెన్ హైతీ తిరుగుబాటుదారులు బాధ్యత వహించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సౌదీ అరేబియాలోని నైరుతి నగరమైన ఖామిస్ ముషైట్లోని కింగ్ ఖలీద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఈ సంస్థ పేర్కొన్నది. దాడి ఖచ్చితమైనదని హౌతీ మిలిటరీ ప్రతినిధి యేయా సరియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అయితే, హైతీ తిరుగుబాటుదారులు యెమెన్ నుంచి జరిపిన డ్రోన్ దాడిని సైన్యం అడ్డుకున్నట్లు సౌదీ యాజమాన్యంలోని అల్ అరేబియా టీవీ వార్తలు నివేదించాయి.
2014 నుంచి యెమెన్లో అంతర్యుద్ధం కొనసాగుతున్నది. సౌదీ అరేబియా కూడా 2015 నుంచి ఈ యుద్ధంలో పాల్గొంటున్నది. అక్కడి ప్రభుత్వానికి మద్దతు ఇస్తుండటం హైతీ తిరుగుబాటుదారులకు ఆగ్రహం తెప్పిస్తున్నది. అందువల్ల, సౌదీ అరేబియా సరిహద్దు ప్రాంతాలను కూడా హైతీ తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకున్నారు. దానిలో భాగంగానే ఇటీవల సౌదీ వైమానిక స్థావరంపై వారు డ్రోన్ దాడులకు తెగబడ్డారు.
అంగారకుడిపై నాసా ఆక్సిజన్ ఉత్పత్తి
మొక్కల పెంపకంపై గూగుల్ డూడుల్
పాకిస్తాన్లో శాంతిని భారత్ కోరుకోవడం లేదు : పాక్ మంత్రి షేక్ రషీద్
పాకిస్తాన్లో సీనియర్ జర్నలిస్టుపై కాల్పులు
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఐక్యరాజ్య సమితి ముఖ్య కమిటీల్లో భారత్ సభ్యత్వం
చాద్ అధ్యక్షుడు ఇద్రిస్ డెబ్బీ దారుణహత్య
హాయిగా నిదురపో.. జ్ఞాపకశక్తి పెంచుకో..!
వేగాన్లలో ఎముకల పగుళ్లు.. పరిశోధకుల హెచ్చరిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..