అన్ జమేనా: మధ్య ఆఫ్రికా దేశం చాద్ అధ్యక్షుడు ఇద్రిస్ డెబ్బీ దారుణహత్యకు గురయ్యారు. తిరుగుబాటుదారులతో జరిగిన ఘర్షణలో ఆయన మరణించారు. మూడు దశాబ్దాలకు పైగా చాద్ దేశ అధ్యక్షుడిగా సేవలందించారు. ఇద్రిస్ డెబ్బీ మరణాన్ని జాతీయ టెలివిజన్, రేడియోలో సైన్యం ప్రకటించి ధ్రువీకరించింది.
అధ్యక్ష ఎన్నికల్లో ఇద్రిస్ డెబ్బీ విజయాన్ని ఎన్నికల అధికారులు కొద్ది గంటల ముందే ప్రకటించారు. ఇదే సమయంలో ఆయన మరణ వార్త కూడా రావడం విషాదకరం. చాద్ అధ్యక్ష ఎన్నిక ఏప్రిల్ 11 న జరిగాయి. ఈ విజయంతో ఇద్రిస్ డెబ్బీ అధ్యక్ష పదవిలో మరో ఆరు సంవత్సరాలపాటు కొనసాగవచ్చు.
డెబ్బీ 37 ఏండ్ల కుమారుడు మహమత్ ఇద్రిస్ డెబ్బీ 18 నెలల ట్రాన్సిషనల్ కౌన్సిల్కు నాయకత్వం వహిస్తారని ఆర్మీ తెలిపింది. అదే సమయంలో సాయంత్రం ఆరు గంటల నుంచి దేశవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించినట్లు సైన్యం ప్రకటించింది.
తిరుగుబాటుదారులతో ఘర్షణ జరిగిన ప్రాంతం మారుమూల ప్రదేశంలో ఉన్నందున ఇద్రిస్ డెబ్బీ మరణాన్ని స్వతంత్రంగా నిర్ధారించలేం. అతడి మరణానికి ఏ పరిస్థితులు దారితీశాయో కూడా బయటపడలేదు. అధ్యక్షుడు ఉత్తర చాద్లోని సుదూరంగా ఉన్న ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్లారనేది.. అలాగే తన పాలనను వ్యతిరేకిస్తున్న తిరుగుబాటుదారులతో ఎందుకు గొడవ పడ్డారనే విషయాలు ఇంకా తెలియరాలేదు.
మాజీ కమాండర్-ఇన్-చీఫ్ అయిన ఇద్రిస్ డెబ్బీ 1990 లో అధికారంలోకి వచ్చారు. తిరుగుబాటు దళాలు అప్పటి అధ్యక్షుడు హిస్సెన్ హుబ్రేను పదవి నుంచి దించేశాయి. తర్వాత సెనెగల్లోని అంతర్జాతీయ మానవ హక్కుల ట్రిబ్యునల్ హుబ్రేను దోషిగా తేల్చింది.
ఇద్రిస్ డెబ్బీ గత అనేక సంవత్సరాలుగా సాయుధ తిరుగుబాట్లను ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ వీటినన్నింటిని అధిగమించి అధికారంలో ఉన్నాడు. తిరుగుబాటుదారులు పొరుగున ఉన్న లిబియాలో సాయుధ శిక్షణ పొంది.. ఈ నెల 11 న నార్త్ చాద్లోకి ప్రవేశించినట్లుగా సమాచారం.
హాయిగా నిదురపో.. జ్ఞాపకశక్తి పెంచుకో..!
వేగాన్లలో ఎముకల పగుళ్లు.. పరిశోధకుల హెచ్చరిక
బ్రిటన్లో తగ్గిన కొవిడ్ మరణాలు..
తూత్తుకుడిలో 1500 కోట్ల కొకైన్ పట్టివేత
అసోంలో ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగుల అహరణ
ఉద్రిక్తతలను పెంచుతున్న ఉత్తర కొరియా కదలికలు
రాజస్థాన్ జైలు నుంచి ఖైదీలు పరారీ
జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు
భారత ప్రధానిగా ఇంద్రకుమార్ గుజ్రాల్.. చరిత్రలో ఈరోజు
పాపం తల్లి ప్రేమ.. చనిపోయిన కొడుకుతో నిత్యం ఫోన్ కాల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..