గువాహటి : అసోంలో ఉల్ఫా తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అక్కడి ఓఎన్జీసీలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను వారు బుధవారం కిడ్నాప్ చేశారు. అసోం, నాగాలండ్ సరిహద్దుల్లోని శివసాగర్ క్షేత్రం నుంచి వీరిని ఉల్ఫా తీవ్రవాదులు అపహరించుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఓఎన్జీసీకి చెందిన వాహనంలోనే వీరిని అపహరించుకుపోయినట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన వివరాలను ఓఎన్జీసీ ఒక ప్రటకనలో తెలిపింది.
అసోం సరిహద్దులోని లక్వా క్షేత్రం నుంచి ఓఎన్జీసీలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగుల్ని సాయుధులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాప్కు గురైనవారిలో జూనియర్ టెక్నిషియన్లు గొగొయి, రితుల్ సైకియా, జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్ అఖిలేష్ సైకియా ఉన్నారు. వీరిని తీసుకెళ్లిన వాహనం నిమోనాగఢ్ అడవిలో లభ్యమైనట్లు ఓఎన్జీసీ తెలిపింది.
ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో సంస్థ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. అపహరణకు సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉద్యోగులను అపహరించుకుపోయిన వారు ఇంతవరకు ఎలాంటి డిమాండ్లను పంపలేనట్లుగా తెలుస్తున్నది.
ఉద్రిక్తతలను పెంచుతున్న ఉత్తర కొరియా కదలికలు
రాజస్థాన్ జైలు నుంచి ఖైదీలు పరారీ
జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు
భారత ప్రధానిగా ఇంద్రకుమార్ గుజ్రాల్.. చరిత్రలో ఈరోజు
పాపం తల్లి ప్రేమ.. చనిపోయిన కొడుకుతో నిత్యం ఫోన్ కాల్
గర్భంతో ఉన్నా.. మండుటెండ, కరోనాను లెక్కచేయకుండా విధుల్లో డీఎస్పీ.. వీడియో వైరల్
వీటితో కరోనాకు చెక్ పెట్టొచ్చు.. శాస్త్రవేత్తల పరిశోధనలో సంచలన విషయాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..