లండన్ : వేగాన్లలో ఎముకలు బలహీనపడిపోవడంతోపాటు పగుళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకునే వారిని మాంసం తినే వారితో పోలిస్తే కాల్షియం, ప్రోటీన్ లోపం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆరు తేల్చారు. ఫలితంగా ఎముకలు 43 శాతం మేర పగుళ్లకు గురవుతున్నట్లు గుర్తించారు.
బీఎంసీ జర్నల్లోని పబ్లిక్ రీసెర్చ్ ప్రకారం.. శాకాహారం తీసుకున్న వేయి మందిని 10 ఏండ్ల పాటు పరిశీలించగా.. వారి తుంటి, కాలు ఎముకలు, వెనుక ఎముకల్లో పగుళ్లు ఉన్నట్లు తేలింది. శాకాహారం తీసుకున్న వారిలో మాంసం తినేవారి కంటే 2.3 రెట్లు ఎక్కువ హిప్ ఫ్రాక్చర్ కేసులు ఉన్నాయని డైట్ నిపుణులు టామీ టోంగ్ చెప్పారు. వేయి మందిలో ఇటువంటి 20 తీవ్రమైన కేసులు కనిపించాయని ఆయన తెలిపారు. శాకాహారం తీసుకునేవారికి కాల్షియం, ప్రోటీన్ తగ్గడంతో పాటు బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) కూడా తగ్గుతుందని పరిశోధనలు చెప్తున్నారు. అందువల్ల, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని వారు హెచ్చరిస్తున్నారు.
వేగాన్లు పూర్తిగా శాఖాహారం మాత్రమే తింటారు. వీరి ఆహారంలో మాంసం, గుడ్లు ఉండవు. పాలు, పెరుగు, నెయ్యి, జున్ను వంటి పాల ఉత్పత్తులను తినడం నిషేధిస్తారు. చాలా మంది తేనె కూడా తినరు. వీరి ఆహారంలో మొక్కల నుంచి లభించే వస్తువులను మాత్రమే తీసుకుంటారు. ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, చిక్కుళ్ళు, డ్రైఫ్రూట్స్ వంటివి మాత్రమే ఆహారంగా తీసుకుంటారు.
వేగాన్లకు కాల్షియం అందాలంటే.. జును, పెరుగు, ఆకుగోబి, బీన్స్, పాలకూర ఎక్కువగా తింటుండాలి. అదేవిధంగా ప్రోటీన్ల కొరకు బీన్స్, బ్రకోలి, సోయాల పాలు, రాజ్మా, టోఫూ, బంగాళదుంపలు, శెనగలు, పుట్టగొడుగులు, వేరుశనగ, బాదాంలను ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
వేగాన్ డైట్ అదేపనిగా మూడు నెలలపాటు తీసుకునేవారిలో డీ విటమిన్తోపాటు బీ 12 విటమిన్, కాల్షియం, ఐరన్ లోపం కనిపిస్తుందని వారు చెప్తున్నారు. సాధారణ పాలకు బదులుగా చాలా మంది సోయా పాలు తీసుకుంటారని, అయితే, సోయా పాలను మరీ ఎక్కువగా తీసుకున్నవారిలో హార్మోన్ల అసమతుల్యత కనిపించిందని వారు తెలిపారు. డీ విటమిన్ లోపాన్ని సవరించుకునేందుకు ఉదయాన్నే నీరెండలో నిలుచోవడం చేయాలని వారు సూచిస్తున్నారు.
బ్రిటన్లో తగ్గిన కొవిడ్ మరణాలు..
తూత్తుకుడిలో 1500 కోట్ల కొకైన్ పట్టివేత
అసోంలో ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగుల అహరణ
ఉద్రిక్తతలను పెంచుతున్న ఉత్తర కొరియా కదలికలు
రాజస్థాన్ జైలు నుంచి ఖైదీలు పరారీ
జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు
భారత ప్రధానిగా ఇంద్రకుమార్ గుజ్రాల్.. చరిత్రలో ఈరోజు
పాపం తల్లి ప్రేమ.. చనిపోయిన కొడుకుతో నిత్యం ఫోన్ కాల్
గర్భంతో ఉన్నా.. మండుటెండ, కరోనాను లెక్కచేయకుండా విధుల్లో డీఎస్పీ.. వీడియో వైరల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..