మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర కూడా అవసరం. 50 ఏండ్ల వయస్సు వరకు 6 గంటలు లేదా అంతకంటే తక్కువ నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి సన్నగిల్లుతుందని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. జనరల్ నేచర్ కమ్యూనికేషన్లో ప్రచురించిన నివేదిక ప్రకారం, తగినంత నిద్ర లేని వారిలో 70 ఏండ్లు వచ్చేసరికి జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం పెరుగుతుంది.
1985 నుంచి 2016 వరకు బ్రిటన్లో నిర్వహించిన ఒక అధ్యయనంలో 8,000 మందిని పరిశీలించారు. ఇందులో, 50 ఏండ్లు పైబడిన వారి నిద్ర ప్రతి స్థాయిలో పరీక్షించారు. 6 గంటలు లేదా అంతకంటే తక్కువ నిద్రపోయిన వారు మూడు దశాబ్దాల తర్వాత జ్ఞాపకశక్తి కోల్పోయిన లక్షణాలు కనిపించాయి. 70 ఏండ్ల వయసులో కూడా 7 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోయిన వారు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించారు.
వాస్తవానికి 30 సంవత్సరాల పాటు కొనసాగిన ఈ అధ్యయనం పేలవమైన నిద్ర ఎంతగా జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేస్తుందనే దానికి ఖచ్చితమైన ఆధారాలను ఇచ్చిందని శాన్ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం న్యూరాలజీ, సైకియాట్రీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ క్రిస్టిన్ యాఫ్ఫే చెప్పారు. తక్కువ నిద్ర ఎప్పటికైనా ప్రమాదకరమైనదే అని రుజువైందన్నారు. మెదడులో అల్జీమర్స్ అనుబంధ ప్రోటీన్ల పేరుకుపోవడం వంటి మార్పులు వస్తాయని, దీనివల్ల ప్రజలు జ్ఞాపకశక్తి లోపం కలిగి ఉంటారని ఈ అధ్యయనంపై వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎరిక్ అభిప్రాయపడ్డారు.
వైట్ హాల్-2 పేరుతో బ్రిటీష్ వాలంటీర్లు 1985 లో ప్రారంభించిన ఈ అధ్యయనం.. వివిధ ప్రమాణాలతో 7,959 మంది నిద్రపై పరిశోధనల చేశారు.
వేగాన్లలో ఎముకల పగుళ్లు.. పరిశోధకుల హెచ్చరిక
బ్రిటన్లో తగ్గిన కొవిడ్ మరణాలు..
తూత్తుకుడిలో 1500 కోట్ల కొకైన్ పట్టివేత
అసోంలో ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగుల అహరణ
ఉద్రిక్తతలను పెంచుతున్న ఉత్తర కొరియా కదలికలు
రాజస్థాన్ జైలు నుంచి ఖైదీలు పరారీ
జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు
భారత ప్రధానిగా ఇంద్రకుమార్ గుజ్రాల్.. చరిత్రలో ఈరోజు
పాపం తల్లి ప్రేమ.. చనిపోయిన కొడుకుతో నిత్యం ఫోన్ కాల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..