గాజా : ఈ యుద్ధం కొనసాగుతుంది అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. మాపై కాలు దువ్విన హమాస్కు తగిన గుణపాఠం చెప్పేంత వరకు వెనుకంజ వేయమన్నారు. ఆదివారం ఆయన టెలివిజన్ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన పాలస్తీనాను, హమాస్ ఉగ్రవాదులను తీవ్రంగా హెచ్చరించారు. ఆదివారం గాజా నగరంలో దాదాపు 42 మందిని ఇజ్రాయెల్ పొట్టనపెట్టుకున్నది.
ఆదివారం గాజా నగరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టి మూడు భవనాలను పూర్తిగా నేలమట్టం చేసింది. ఈ వైమానిక దాడిలో కనీసం 42 మంది చనిపోయినట్లు తెలుస్తున్నది. ఇజ్రాయెల్-గాజాలో పాలస్తీనియన్ల మధ్య నాలుగో యుద్ధానికి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సంకేతాలు ఇవ్వడంతో కాల్పులు భీకరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు కాల్పుల విరమణకు అంతర్జాతీయ సంస్థలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
ఈ నేపథ్యంలో టెలివిజన్ ప్రసంగం చేసిన నెతన్యాహు.. యుద్ధం కొనసాగుతుందని, మాపై యుద్ధానికి దిగిన హమాస్కు సరైన బుద్ధి చెప్పేంతవరకు ముందుకెళతాం అని ప్రకటించారు. హమాస్పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రేపు విడుదల కానున్న2 డీజీ ఫస్ట్ బ్యాచ్
అమెరికా ఉద్యోగం కన్నా పాడిలో నాలుగింతలు ఎక్కువ సంపాదన : కిషోర్ మంత్రం
గంగా నది ఇసుకలో సమాధులు.. వెలికితీసిన వరుణుడు
సీఎం ఖట్టర్కు రైతుల నిరసన.. హిసార్లో పరిస్థితి ఉద్రిక్తం
ఇజ్రాయెల్ దాడిలో హమాస్ అగ్రనేత ఇల్లు ధ్వంసం
టీకా ఉత్పత్తులు వేగవంతం చేయండి: మోదీకి ఆజాద్ లేఖ
యుద్ధం వస్తే అమెరికాదే ఓటమి: గ్లోబల్ టైమ్స్ సంపాదకీయం
టెస్ట్ ఆడట్లేదని నేననలేదు : భువనేశ్వర్ కుమార్
13 రోజులు ప్రధానిగా వాజ్పేయి.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..