న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో గంగా నది తీరం వెంబడి ఇసుకలో పాతిపెట్టిన వేలాది సమాధులను వరుణుడు వెలికితీశాడు. ఒకవైపు పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు జరుగుతుండటం.. ఇంకోవైపు శవాలను కాల్చేందుకు కట్టెలు కరువై.. చాలా మంది తమ వారిని ఇసుకలో సమాధి చేసి మమ అనిపించారు. అయితే, ఇటీవల కురిసిన వర్షంతో భాగోతం అంతా బట్టబయలైంది. దాదాపు రెండు వేలకు పైగా మృతదేహాలు గంగా నది తీరం వెంబడి బయటపడినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఈ వారం ప్రారంభంలో ఉత్తరప్రదేశ్లోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో కురిసన వర్షాలు మానవుల నిస్సహాయతను బట్టబయలు చేశాయి. కరోనా వైరస్ సోకి చనిపోయిన వారిని గంగా నది తీరం వెంబడి సామూహికంగా, పైపైనే ఇసుకలో పాతిపెట్టిన విషయం ఇటీవల కురిసిన వర్షాలతో బయటకొచ్చింది. శవాలను కాల్చేందుకు సరైన కర్రలు లేకపోవడంతో ఇసుకలో తూతూ మంత్రంగా సమాధి చేశారు. ఇసుకలో పైపైనే శవాలు ఉండటంతో కొద్దిపాటి వర్షానికే ఇవి బయటపడ్డాయి. దాంతో రెండు వేలకు పైగా శవాలు సామూహిక సమాధులు బయటపడినట్లు స్థానిక వార్తాపత్రికలు కథనాలు ప్రచురించాయి.
ఈ విషయాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు వెంటనే ఈ ధోరణిని నిలుపు చేయాలంటూ సూచించింది. ఉత్తరప్రదేశ్లో చేపలు పట్టేందుకు వెళ్లిన 71 మంది మృతదేహాలను గుర్తించినట్లు బిహార్ బక్సర్ జిల్లా అధికారులు సమాచారం ఇచ్చిన ఐదు రోజుల తర్వాత వానలు కురియడం, 2 వేలకు పైగా మృతదేహాలు బయటపడటం జరిగింది. శవ దహనానికి డబ్బు ఖర్చు చేయలేని వారు, అలాగే కట్టెలు కరువుతో మృతదేహాలను పడేసి వెళ్లిన వారు ఎందరో ఉన్నారు. గంగా నది తీరంలోని ఇసుకలో పైపైనే సమాధుల మాదిరిగా కట్టి చేతులు దులిపేసుకున్నారు. యూపీలోని కాన్పూర్, ఉన్నవో, ఘాజిపూర్, కన్నౌజ్, బల్లియా సహా అనేక జిల్లాల్లో కరోనా మృతదేహాలను గంగా ఒడ్డున పాతిపెట్టినట్లు తెలుస్తున్నది. పలు మృతదేహాలు గంగా నదిలో తేలియాడుతూ కింది ప్రాంతాలకు వచ్చిన సందర్భంలో కలకలం రేగింది.
సీఎం ఖట్టర్కు రైతుల నిరసన.. హిసార్లో పరిస్థితి ఉద్రిక్తం
ఇజ్రాయెల్ దాడిలో హమాస్ అగ్రనేత ఇల్లు ధ్వంసం
టీకా ఉత్పత్తులు వేగవంతం చేయండి: మోదీకి ఆజాద్ లేఖ
యుద్ధం వస్తే అమెరికాదే ఓటమి: గ్లోబల్ టైమ్స్ సంపాదకీయం
టెస్ట్ ఆడట్లేదని నేననలేదు : భువనేశ్వర్ కుమార్
13 రోజులు ప్రధానిగా వాజ్పేయి.. చరిత్రలో ఈరోజు
–తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..