న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతమున్న పరిస్థితులను శాంత పరిచేందుకు టీకా ఉత్పత్తులను వేగవంతం చేయడం ఒక్కటే మార్గమని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. అత్యవసర వినియోగానికి అనుమతించిన టీకాలు పెద్ద మొత్తంలో ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవడం ద్వారానే కొవిడ్ను అదుపులో పెట్టవచ్చునన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఆజాద్ లేఖ రాసి పలు సూచనలు చేశారు.
ఆక్సిజన్ లభ్యతను మెరుగుపరచడంతో పాటు మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి టీకా స్థలాలను ఏర్పాటు చేయడానికి ముందే సిద్ధం చేసిన పడకలు, యూనిట్లను ఉపయోగించాలని కేంద్ర మాజీ ఆరోగ్య మంత్రి అయిన ఆజాద్ సూచించారు.
కరోనా రిలీఫ్ కోఆర్డినేషన్ కోసం పార్టీ ఏర్పాటు చేసిన 13 మంది సభ్యుల టాస్క్ఫోర్స్కు అధిపతిగా కాంగ్రెస్ ఇటీవల ఆజాద్ను నియమించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్కు రాసిన లేఖలో ఆజాద్ నాలుగు సూచనలు చేశారు. వ్యాక్సిన్లు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్ కొరతను ఎత్తిచూపిన ఆయన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు, వైద్యులు, భద్రతా దళాలతో పాటు ఫ్రంట్లైన్ కార్యకర్తల అసాధారణ సహకారానికి సంబంధించి సూచనలు చేస్తున్నట్లు తన లేఖలో తెలిపారు.
“దేశంలో 21 ప్రధాన వ్యాక్సిన్ తయారీదారులు ఉన్నారని, ఈ కంపెనీలన్నింటిలో బయో-సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక తయారీ సౌకర్యాలు ఉన్నాయి. వాస్తవానికి వీటిలో ఏడు డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు సరిపోయేలా ఉన్నాయి. వీటిలో రెండు ప్రసిద్ధ వ్యాక్సిన్ తయారీ సంస్థలు.. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు కోవిషీల్డ్, కోవాగ్జిన్లను తయారు చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు నిరంతరంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, దేశ అవసరాలను తీర్చడానికి వాటిపై తీవ్ర ఒత్తిడి ఉన్నది. భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ అభివృద్ధికి బయోటెక్నాలజీ, ఐసీఎంఆర్ సహకరించాయని నమ్ముతున్నాను. వారు ఈ సాంకేతికతను డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఇతర ఔషధ సంస్థలతో పంచుకోవడం సముచితం. ఇది వెంటనే కోవాగ్జిన్ ఉత్పత్తిని వేగంగా జరుపుతుంది. టీకా కవరేజీని వీలైనంతగా మెరుగుపరుస్తుంది” అని ఆజాద్ తన లేఖలో పేర్కొన్నారు.
యుద్ధం వస్తే అమెరికాదే ఓటమి: గ్లోబల్ టైమ్స్ సంపాదకీయం
టెస్ట్ ఆడట్లేదని నేననలేదు : భువనేశ్వర్ కుమార్
13 రోజులు ప్రధానిగా వాజ్పేయి.. చరిత్రలో ఈరోజు
ఆఫ్ఘన్-తాలిబాన్ల మధ్య చర్చలు తిరిగి ప్రారంభం
పంచన్ లామా సమాచారం ఇవ్వండి.. చైనాను అడిగిన అమెరికా
స్పైస్జెట్ నిర్వాకం.. రోజంతా పైలట్లకు జాగారం..
టీకాలు తీసుకున్నా.. మాస్క్లు మరువొద్దు : డాక్టర్ రణదీప్ గులేరియా
ఆధునిక హంగులతో రాజధానిని నిర్మిస్తున్న ఈజిప్ట్
–తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..