న్యూఢిల్లీ : పూర్తిగా టీకాలు తీసుకున్నా వారు కూడా మాస్కులు ధరించడం, నిర్ణీత భౌతిక దూరం కొనసాగించాలని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా సూచించారు. కొవిడ్-19 నిరంతరం తన మ్యుటేషన్ను మార్చుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టీకాలు ఎంతవరకు రక్షిస్తాయో నిపుణులకు ఇంకా తెలియలేదని, అందుకే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. డాటా వచ్చేంతవరకైనా కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉన్నదన్నారు.
పూర్తిగా టీకాలు తీసుకున్నవారు మాస్క్లు లేకుండా బయటకు వెళ్ళవచ్చని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో డాక్టర్ గులేరియా ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా మనం వ్యవహరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
దేశంలోని ప్రజలందరికీ టీకాలు వేయడం ఒకటి లేదా రెండు నెలల్లో సాధ్యం కాదని తేల్చిచెప్పారు. అయితే, రెండు నెలల్లో పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ లభించునున్నదని, అప్పుడు చిన్నారులకు కూడా వ్యాక్సిన్లు వేసే స్థాయికి చేరుకుంటామన్నారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్కు గురైతే వృద్ధులు, తక్కువ వ్యాధి నిరోధక శక్తి ఉన్న రోగులు చనిపోయే అవకాశం ఉన్నదని డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఇటువంటి పరిస్థితిలో అలాంటి వారికి టీకాలు వేయడానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు.
ఆధునిక హంగులతో రాజధానిని నిర్మిస్తున్న ఈజిప్ట్
“మీ ప్రియమైన వారి చేయి వదలకండి”: టీనా అంబానీ సందేశం
తెరపైకొచ్చిన మిక్కీ మౌస్.. చరిత్రలో ఈరోజు
అక్కడ మసీదులు మాయమయ్యాయి.. ఎందుకంటే..?
గూగుల్తో జతకట్టిన ఎలోన్ మస్క్ ‘స్టార్లింక్’
ఉదయం చురుకైన నడకతో కరోనాకు చెక్..!
నేను చనిపోతే ఎవరెవరు వస్తారో చూస్తా..! ఓ మహిళ డెత్ రిహార్సల్
టీకా తీసుకోండి.. రూ.7.35 కోట్ల జాక్పాట్ గెలుచుకోండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..