న్యూఢిల్లీ: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని పురస్కరించుకుని పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి అందమైన సందేశాన్ని పంచుకున్నారు. మనకు ప్రియమైన వారిని మరింత దగ్గరగా ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి సందేమిచ్చారు. ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో మనం ఏదైనా నేర్చుకున్నాం అంటే.. అది ఒక్కటే కుటుంబం యొక్క ప్రాముఖ్యత అని చెప్పారు. “ప్రతిరోజూ అందరం కలిసి ఉల్లాసంగా గడపడానికి కారణంగా ఉంటుంది. పండగ చేసుకునేందుకు సందర్భం. కృతజ్ఞతలు చెప్పేందుకు అవకాశం వచ్చింది. మీ ప్రియమైన వారిని దగ్గరగా – శారీరకంగా, మానసికంగా లేదా వాస్తవంగా అదిమి పట్టుకోండి” అని కోకిలాబెన్ డీ అంబానీ దవాఖాన చైర్పర్సన్ కూడా అయిన టీనా అంబానీ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాశారు. దానితో పాటు తన కుటుంబం ఫొటోను కూడా షేర్ చేశారు.
ఈ చిత్రంలో టీనా అంబానీ, ఆమె భర్త అనిల్ అంబానీ, వారి ఇద్దరు కుమారులు – అన్మోల్, అన్షుల్ అంబానీ ఉన్నారు. “మీ ప్రియమైన వారి స్వభావాలను తెలుసుకోండి. వారికి ఏమి నచ్చుతుంది.. ఏది ఇష్టమైంది.. వారు కోరుకునేది ఏమిటి..? అనేది తెలుసుకుని వారి ఆకాంక్షలు తీరేలా వారికి సాయపడండి” అని ఆమె ఇంకా రాసింది.
ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండి పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్న ఈ సమయంలో టీనా అంబానీ సందేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ప్రతి ఒక్కరు ఇంటిపట్టున ఉండేందుకు సమయం చిక్కింది. ఈ సమయాన్ని కుటుంబంతో ఆహ్లాదంగా గడిపేందుకు, వారి ఇష్టాయిష్టాలను తెలుసుకునేందుకు, వారి ఆకాంక్షలు నెరవేరేలా ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు కావాల్సినంత సమయం దొరికింది. ఈ అవకాశాన్ని అందరూ సక్రమంగా వినియోగించుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటారని, అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆశిద్దాం.
తెరపైకొచ్చిన మిక్కీ మౌస్.. చరిత్రలో ఈరోజు
అక్కడ మసీదులు మాయమయ్యాయి.. ఎందుకంటే..?
గూగుల్తో జతకట్టిన ఎలోన్ మస్క్ ‘స్టార్లింక్’
ఉదయం చురుకైన నడకతో కరోనాకు చెక్..!
కరోనాతో విలవిల.. టోక్యో ఒలింపిక్స్ ఎలా..?
నేను చనిపోతే ఎవరెవరు వస్తారో చూస్తా..! ఓ మహిళ డెత్ రిహార్సల్
టీకా తీసుకోండి.. రూ.7.35 కోట్ల జాక్పాట్ గెలుచుకోండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..